Home » Medigadda Barrage
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం/నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా?
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అరకొర వానలతో అవస్థలు పడుతున్న అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాధార పంటలైన పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది పంటలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజ్కు ప్రాణహిత వరద పెరుగుతోంది. బ్యారేజీలోకి 8800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. బ్యారేజ్ రక్షణ చర్యలో భాగంగా ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు.. గ్రౌటింగ్, సీ సీ బ్లాకుల పునరుద్ధరణ, షీట్ ఫైల్స్ అమరిక పూర్తయ్యింది. గేటు విడిభాగాలను తొలగించేశారు.
మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్ ఒకటైతే నిర్మాణం మరోరకంగా చేశారని, అందుకే అది కుంగిందని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లేదని, నిర్వహణ కూడా సరిగా లేదని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ అధికారుల్లో మరోమారు గుబులు మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు ఇరిగేషన్ అధికారులు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది.
మాజీ సీఎం కేసీఆర్పై (KCR) టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) షాకింగ్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరొక రకంగా చేయడంతో కుంగిపోయిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ మెటిరీయల్ సక్రమంగా లేదు, నిర్వహణ కూడా లేదని డ్యాంసేప్టీ అధికారులు చెప్పారని గుర్తుచేశారు.
మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రౌటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకోగా షీట్ పైల్స్ అమరిక పనులు పూర్తికావస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలేబ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి, నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ పదేళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం మూడేళ్ల వ్యవధిలోనే హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా?
గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ/రిజర్వాయర్ నిర్మిస్తామని ఇంతకాలం పట్టుబట్టిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఒక మెట్టు దిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.