Home » Medigadda Barrage
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) ప్రకటించారు. మంగళవారం నాడు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలల్లో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవకతవకలు బయటపెతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపట్టిస్తామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం శుక్రవారం రానుంది. ఇక్కడే బ్యారేజీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు ( Medigadda project ) కు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారంలో జరిగిన లోపాలపై దర్యాప్తు జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు.
మేడిగడ్డ కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..త్వరలోనే ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళ్తాం అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్( Medigadda (Lakshmi) Barrage ) లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) హెచ్చరించారు. సోమవారం నాడు జలసౌధలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) పిల్లర్లు కుంగడ, గతంలో కన్నెపల్లి పంపుహౌజ్
లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
‘‘మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో ఉత్పన్నమైన సమస్యను రిపేరు చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి, పునర్నిర్మించాలి.