• Home » Maoist Encounter

Maoist Encounter

అబూజ్‌మడ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

అబూజ్‌మడ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

మావోయిస్టుల కంచుకోట అబుజ్‌మడ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు-నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. ఇద్దరు జవాన్లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి.

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

మావోయిస్టుల దాడిలో ‘కడప’ జవాన్‌ మృతి

మావోయిస్టుల దాడిలో ‘కడప’ జవాన్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో అబూజ్‌మడ్‌ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి కడప జవాన్‌ సహా ఐటీబీపీ(ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు) దళానికి చెందిన ఇద్దరు మరణించారు.

DGP Jitender: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పటిష్ఠ భద్రత

DGP Jitender: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పటిష్ఠ భద్రత

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నట్లు వెల్లడించారు.

Chattisgarh: రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఇద్దరు జవాన్లు మృతి

Chattisgarh: రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఇద్దరు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్ జిల్లా దుర్బేరా సమీపంలోని కొడ్లియార్ అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా బుధవారం ఐఈడీని మావోయిస్టులు పేల్చారు. ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Maoist Party: కిషన్ జీ భార్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్ట్ పార్టీ

Maoist Party: కిషన్ జీ భార్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్ట్ పార్టీ

అక్టోబర్ 4వ తేదీన.. దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మరణించారు. అయితే పోలీసులు మాత్రం 31 మంది వివరాలను మాత్రమే వెల్లడించారు. మిగిలిన వారిలో అగ్రనేతలు ఉన్నారంటూ ఓ ప్రచారం సైతం సాగింది. కానీ ఈ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు ఎవరు మరణించ లేదని స్పష్టం చేసింది.

Maoist: మావోయిస్టు అగ్రనేత సుజాతక్క అరెస్టు?

Maoist: మావోయిస్టు అగ్రనేత సుజాతక్క అరెస్టు?

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం మిస్టరీగా మారింది. సుజాతక్కను రెండు రోజుల క్రితం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

మావోయిస్ట్ పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పన పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కొత్తగూడెంలోని హాస్పిటల్‌కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు తెలియవచ్చింది. కాగా మహబూబాబాద్ బస్టాండ్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది.

Maoist party: గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారు..

Maoist party: గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారు..

అక్టోబర్ 4వ లేదీ ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు 11 సార్లు భద్రతా బలగాలు కాల్పులు జరిపారని.. ఎదురు కాల్పులు ల్లో 14 మంది మావోయిస్ట్‌లు అమరులు అయ్యారని, మరుసటి రోజు ఉదయం (అక్టోబర్ 5 న) కాల్పుల్లో గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. తూర్పు బస్తర్ డివిజన్ కమిటీని అంతం చేయడానికి ఫాసిస్ట్ పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడింది.

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలు ఎల్‌-ఫార్మేషన్‌లో దిగ్బంధిస్తూ తమ సహచరులను ఊచకోత కోశాయని మావోయిస్టులు ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి