• Home » Manish Sisodia

Manish Sisodia

New Delhi: మనీశ్ సిసోడియాతోపాటు అతిషికి రాఖీలు కట్టిన విద్యార్థులు

New Delhi: మనీశ్ సిసోడియాతోపాటు అతిషికి రాఖీలు కట్టిన విద్యార్థులు

మంగళవారం న్యూఢిల్లీ, పశ్చిమ వినోద్ నగర్‌‌లోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషితో కలిసి మనీశ్ సిసోడియా సందర్శించారు. ఈ సందర్బంగా వారికి పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టారు. విద్యార్ధులతో వారిద్దరు కొద్ది సేపు ముచ్చటించారు.

Supreme Court: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్

Supreme Court: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది.

Manish Sisodia: ‘నిజాయితీకి ప్రతీక.. అరవింద్ కేజ్రీవాల్’

Manish Sisodia: ‘నిజాయితీకి ప్రతీక.. అరవింద్ కేజ్రీవాల్’

అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. అలాంటి ఆయన్ని దెబ్బ తీసేందుకు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ వినియోగించుకుంటుందని ఆరోపించారు. అందులోభాగంగానే కేంద్రంలోని మోదీ సర్కార్.. ఆప్ నేతలపై తప్పడు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుందని ఆయన మండిపడ్డారు.

Manish Sisodia: భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్

Manish Sisodia: భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్

దేశంలోని ప్రతి వ్యక్తిని స్వేచ్చగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. దాంతో 17 నెలల తర్వాత... ఈ రోజు ఉదయం ఇలా స్వేచ్చగా టీ తాగుతున్నాను. ప్రతి ఒక్కరితో కలిసి బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛను మాకు దేవుడు కల్పించాడని.. మనీశ్ సిసోడియా తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

Delhi excise policy scam: మనీశ్ సిసోడియాకు బెయిల్.. స్పందించిన సునీత కేజ్రీవాల్

Delhi excise policy scam: మనీశ్ సిసోడియాకు బెయిల్.. స్పందించిన సునీత కేజ్రీవాల్

న్యాయం జరగడం ఆలస్యం కావచ్చునేమో కానీ.. న్యాయం తిరస్కరించబడడం మాత్రం జరగదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పైవిధంగా స్పందించారు.

AAP: జైలు నుంచి విడుదలయ్యాక సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు

AAP: జైలు నుంచి విడుదలయ్యాక సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా(Manish Sisodia) శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆయన 17 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Atishi: మాట్లాడుతూనే ఏడుస్తూ..

Atishi: మాట్లాడుతూనే ఏడుస్తూ..

లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆప్ నేత మనీశ్ సిసోడియాకు ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంపై ఆప్ నేతలు న్యాయం గెలిచింది అంటూ హర్షం వ్యక్తం చేశారు. సిసోడియాకు బెయిల్ వచ్చిందని తెలిసిన వెంటనే ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితల జ్యుడిషియల్ కస్టడీ జులై 31 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. తీహాడ్ జైల్లోనున్న వీరిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది.

Liquor policy case: సిసోడియాకు చుక్కెదరు.. బెయిలు నిరాకరించిన హైకోర్టు

Liquor policy case: సిసోడియాకు చుక్కెదరు.. బెయిలు నిరాకరించిన హైకోర్టు

లిక్కర్ స్కామ్ (Liquor Scam)కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది.

Delhi Excise policy: సిసోడియాకు మళ్లీ నిరాశ.. రెగ్యులర్ బెయిలుకు కోర్టు నిరాకరణ

Delhi Excise policy: సిసోడియాకు మళ్లీ నిరాశ.. రెగ్యులర్ బెయిలుకు కోర్టు నిరాకరణ

ఎక్సైజ్ పాలసీ కేసులో 'ఆప్' నేత మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తును రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఆయనకు బెయిల్‌ ఇచ్చే విషయంపై సీబీఐ, ఈడీలు రెండూ అభ్యంతరం వ్యక్తం చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి