• Home » Manipur

Manipur

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. : టీఎంసీ

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. : టీఎంసీ

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఆరోపించారు. ఆ రాష్ట్రంలో అంతర్యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు ఓ పాత వీడియో బయటపడిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, భారత్‌ను బీజేపీ ఇలా దిగజార్చిందని వ్యాఖ్యానించారు.

Internet : తరచూ ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేసే ఏకైక ప్రజాస్వామిక దేశం భారత్ : శశి థరూర్

Internet : తరచూ ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేసే ఏకైక ప్రజాస్వామిక దేశం భారత్ : శశి థరూర్

సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తూ, సుదీర్ఘ కాలం ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిషేధిస్తున్న ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేయడం వల్ల ఉగ్రవాదం, హింస తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు.

Manipur violence : మణిపూర్‌లో హింసపై సుప్రీంకోర్టు విచారణ

Manipur violence : మణిపూర్‌లో హింసపై సుప్రీంకోర్టు విచారణ

మణిపూర్‌లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.

Manipur violence: మణిపూర్‌లో ఆగని హింస...రెండు వాహనాలకు నిప్పు

Manipur violence: మణిపూర్‌లో ఆగని హింస...రెండు వాహనాలకు నిప్పు

మణిపూర్‌ లో రెండు నెలల క్రితం చెలరేగిన హింసాకాండ ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇంఫాల్‌ ఈస్ట్ జిల్లాలో 150 నుంచి 200 మంది అల్లరిమూక రెచ్చిపోయి రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. శుక్రవారం అర్థరాత్రి వరకూ చెదురుమదురు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనల్లో ఎవరైనా మృతి చెందారా అనేది వెంటనే తెలియలేదు

Manipur Violence: మణిపూర్‌ మంటలపై స్థాయీ నివేదికకు ఆదేశించిన సుప్రీంకోర్టు

Manipur Violence: మణిపూర్‌ మంటలపై స్థాయీ నివేదికకు ఆదేశించిన సుప్రీంకోర్టు

హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజా పరిస్థితిపై స్థాయీ నివేదకను ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి అప్డేడెట్ సమాచారాన్ని తమకు అందజేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు

Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు

అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు.

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

రెండు నెలల నుంచి మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ (Manipur Chief Minister N Biren Singh) ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హింస చెలరేగుతున్నట్లు కనిపిస్తోందన్నారు.

Manipur : హైడ్రామా మధ్య రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సీఎం

Manipur : హైడ్రామా మధ్య రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సీఎం

హైడ్రామా మధ్య తన రాజీనామా నిర్ణయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ శుక్రవారంనాడు వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుతుల్లో తాను రాజీనామా చేయడం లేదంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా ఉదయం నుంచి నుపిలాల్ క్లాంప్లెక్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు శాంతించారు.

Manipur Violence: అక్కడి పరిస్థితి నా గుండెను కలిచివేసింది: రాహుల్

Manipur Violence: అక్కడి పరిస్థితి నా గుండెను కలిచివేసింది: రాహుల్

హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో బాధిత ప్రజలను కలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చలించిపోయారు. వారికి ఎదురైన కష్టం తన గుండెను కలిచివేసిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Manipur : మణిపూర్ ముఖ్యమంత్రికి మద్దతుగా భారీ ప్రదర్శన

Manipur : మణిపూర్ ముఖ్యమంత్రికి మద్దతుగా భారీ ప్రదర్శన

దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం నుపి లాల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని, ఈ సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయవద్దని బిరేన్ సింగ్‌ను డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి