Home » Mangalagiri
ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన ఎ.శిరీష రాణి మంగళగిరిలోని రాష్ట్ర సామాజిక తనిఖీ కేంద్రం(ఏపీ శాట్)లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
హైదరాబాద్లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా: మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయం సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఆటో ఢీ కొంది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల ముందే కన్న బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్ట్రర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తగిన తనయా అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కితాబు ఇచ్చారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆమె ఇలా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) 75వ జయంతి వేడుకలు ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నారు. మంగళగిరి సీకే(CK) కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y.S.Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐసీసీ సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు(Rudra Raju), రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి(Mastan Vali) తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్ని అభివృద్ధిపధంలో నడిపారని రుద్రరాజు గుర్తు చేశారు.
మంగళగిరి(Mangalagiri) టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP central office)పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా... తాజాగా మరో ముగ్గురిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella AppiReddy) అనుచరులు జింకా సత్యం, లంకా అబ్బి నాయుడు, తియ్యగూర గోపిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు పి.హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు జరిపిన దాడిపై రెండున్నర సంవత్సరాల తర్వాత దర్యాప్తు మొదలైంది.