Home » Mangalagiri
ప్రతి పక్ష హోదా సైతం దక్కని వైసీపీకి వరుస షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా విజయవాడలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు.. జనసేన పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 17 ఏళ్ల క్రితం విజయవాడలో ప్రారంభమైన పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్.. ఏపీవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద ఈ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్య వింటూ పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించేందుకు బారులు దీరుతున్నారు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ 2024 మంగళవారం ఉదయం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు.
అమరావతిలో జరగనున్న డ్రోన్ షో విజయవంతం చేయాలని డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం సీకే కన్వెన్షన్ సెంటర్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమగ్నమయ్యారు.
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏ120గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించామన్నారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని తెలిపారు. తమవద్ద ఉన్న ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించామని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ అడిగామని, ఆయన ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని..
సజ్జలతో పాటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున వచ్చారు. సజ్జలతో పాటు వైసీపీ నాయకులు స్టేషన్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతి లేదని తెలిపారు. దీంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో పోలీసులపై..
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.
గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు.