Home » Mangalagiri
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే హామీ అమలైంది. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలపై జీవో విడుదల చేశారు. విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు.
ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఇవాళ మంగళగిరిలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏర్పడింది.. ప్రజా పాలన మొదలైంది. ముందునుంచి చెబుతున్నట్లుగానే.. పాలనలో లోకేష్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆదివారమైనా రెస్ట్ లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని, పరిష్కరించే పనిలో నిలిచారు. అవును, మంత్రి నారా లోకేష్ ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం నాడు తొలిరోజు ప్రజాదర్బార్ ..
మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం ఉదయం జరగనున్నది. ఈ భేటీలో ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్కు (NTR Foundation) నాట్స్ మాజీ అధ్యక్షుడు(USA), తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) రూ. 2 కోట్ల చెక్కును సోమవారం విరాళంగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (AP Election Results) మంగళవారం నాడు (జూన్-04న) రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది. ఇక ఎగ్జాక్ట్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్న పరిస్థితి..
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళగిరిలోని ఎన్డీఆర్ భవన్కు సోమవారం వచ్చారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
అమరావతి: కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ దృష్టి సారించింది. ఓట్ల కౌంటింగ్ హాల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే వైసీపీ నేతల వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.