Home » Mangalagiri
అమరావతి: ఆపన్నులకు అండగా మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే వస్తున్నారు.
ఈనెల 28న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి(TDP AP President)గా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్(Palla Srinivasa Rao Yadav) బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరి (Mangalagiri)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవాహం మధ్యాహ్నం 01:45గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
అమరావతి: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ స్వర్ణకారులకు హామీ ఇచ్చారు. మంగళవారం లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri)లోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రోడ్డుపైనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి (Deputy CM)గా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాధ్యతలు చేపట్టడం అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు జనసేన కార్యాలయానికి బారులు తీరుతున్నారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే హామీ అమలైంది. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలపై జీవో విడుదల చేశారు. విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు.
ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఇవాళ మంగళగిరిలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏర్పడింది.. ప్రజా పాలన మొదలైంది. ముందునుంచి చెబుతున్నట్లుగానే.. పాలనలో లోకేష్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆదివారమైనా రెస్ట్ లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని, పరిష్కరించే పనిలో నిలిచారు. అవును, మంత్రి నారా లోకేష్ ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం నాడు తొలిరోజు ప్రజాదర్బార్ ..
మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం ఉదయం జరగనున్నది. ఈ భేటీలో ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది.