Home » Mandipalli Ram Prasad Reddy
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సునామీ సృష్టించారు. గెలుపు కిక్ నుంచి ఇంకా శ్రేణులు బయటికి రాలేదు. అయితే ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఈనెల 12వ తేదీ బుధవారం నాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. .
రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మండి పల్లి రాంప్రసాద్రెడ్డి ఎంపిక కావడంతో మండిపల్లి భవన్ వద్ద శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసు కున్నారు.
AP Election 2024: సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీతో తలపడేందుకు రేసుగుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు శనివారం ఉండవల్లిలో సంయుక్తంగా తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి..