Home » Mancherial
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ముల్కల్ల ఉన్న త పాఠశాలలో విద్యార్థులకు పునరుత్పాదక శక్తి వనరులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లా డుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలపై అవగా హన పెంచుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లా డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా పాలన సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు.
పచ్చదనం కోసం పట్టణాల్లోని రోడ్డు డివైడర్ల మధ్య పెంచుతున్న కోనోకార్పస్ మొక్కలు ఆరోగ్యరీత్యా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువ య్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమ వుతున్న ఈ మొక్కలను తొలగించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.
విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గౌతమినగర్ ట్రినిటీ హైస్కూల్లో నిర్వ హించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024-25 ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి హాజరయ్యారు.
క్రీడ లతో విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. రెబ్బనపల్లి ఉన్నత పాఠశాల ఆవ రణలో 68వ రాష్ట్రస్థాయి అండర్-17 బాల బాలి కల బీచ్ వాలీబాల్ పోటీలను డీఈవో యాద య్యతో కలిసి ఎమ్మెల్యే టాస్ వేసి ప్రారంభిం చారు.
కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. నస్పూర్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో స్వరాష్ట్ర కలను నిర్థేశించిన రోజు దీక్షా -దీవస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా ఇన్చార్జీ తుల ఉమా, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్య లు తీసుకుంటుందన్నారు.
మం చిర్యాల గోదావరి తీరంలో శ్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను తిరిగి ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావును ఉద్దేశించి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు వ్యాఖ్యానిం చారు. గోదావరి తీరంలో జరుగుతున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరి శీలించారు. పనులను వేగవంతం చేయాలని ఎమ్మె ల్యే అఽధికారులను ఆదేశించారు.
బీసీ కుల గణన కోసం దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహించిన బీసీ కుల గణన చైతన్య యాత్ర ముగింపు సభను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్హాలులో నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ సూచించారు. చింతపల్లి, నెల్కివెంకటాపూర్ గ్రామాల్లోని కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లా డుతూ కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సి బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.