Home » Mancherial
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యు) ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు.
సీఎం కప్ పోటీల్లో జిల్లాను ప్రథమ స్ధానంలో నిలపాలని జిల్లా యువజన క్రీడ అధికారి కీర్తి రాజ్వీరు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోటీలపై డీఈవో యాదయ్య, ఒలింపిక్ కార్యదర్శి రఘునాధ్రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గత నెల 29 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఛాంపియన్షిప్ను కైవసం చేసుకొంది.
ధరణి సమ స్యల పరిష్కారం నానాటికీ జఠిలంగా మారుతోంది. భూ సమస్యలు పరిష్కరించాలని రైతులు రెవెన్యూ కార్యాల యాలకు, జిల్లా కేంద్రంలో కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎయిడ్స్ కం ట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ముఖ్య కూడళ్ల మీదుగా జీజీహెచ్ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు.
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ముల్కల్ల ఉన్న త పాఠశాలలో విద్యార్థులకు పునరుత్పాదక శక్తి వనరులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లా డుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలపై అవగా హన పెంచుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లా డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా పాలన సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు.
పచ్చదనం కోసం పట్టణాల్లోని రోడ్డు డివైడర్ల మధ్య పెంచుతున్న కోనోకార్పస్ మొక్కలు ఆరోగ్యరీత్యా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువ య్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమ వుతున్న ఈ మొక్కలను తొలగించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.
విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గౌతమినగర్ ట్రినిటీ హైస్కూల్లో నిర్వ హించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024-25 ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి హాజరయ్యారు.
క్రీడ లతో విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. రెబ్బనపల్లి ఉన్నత పాఠశాల ఆవ రణలో 68వ రాష్ట్రస్థాయి అండర్-17 బాల బాలి కల బీచ్ వాలీబాల్ పోటీలను డీఈవో యాద య్యతో కలిసి ఎమ్మెల్యే టాస్ వేసి ప్రారంభిం చారు.