Home » Mancherial district
కిష్టంపేట, ఆస్నాద్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్ మోతిలాల్ పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి మద్దతు ధర తోపాటు రూ.500 బోనస్ ఇస్తుందన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే మెయిల్ సర్వీస్ (ఆర్ఎంఎస్) సార్టింగ్ ఆఫీస్ను ఇక్కడి నుంచి తరలించే యోచనను పోస్టల్శాఖ ఎట్టకేలకు రద్దు చేసుకొంది. ఈ నెల 7న కార్యాలయం తరలిపోనుండగా, గురువారం ఆ ప్రయ త్నాన్ని విరమించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యా యి.
లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తాలో మోదీ మోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వ హించారు. నాయకులు మాట్లాడుతూ 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశాన్ని నాశనం చేయాలని ప్రధాని కుట్రలు చేస్తున్నాడన్నారు.
నష్టాల బాటలో నడిచే ఆర్టీసీ సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో లాభాల బాటలో పయనిస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వంలో సకల జనుల సంబురం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బాలికలందరు స్వీయ రక్షణ పాటిస్తూ జాగ్రత్తగా మెలగాలని వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి సూచించారు. మంచిర్యాలకు చెందిన భరోసా సహాయక కేంద్రం ఆధ్వర్యంలో వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికలకు అవగాహన కల్పించారు.
మం డలంలోని శివలింగాపూర్ గ్రామంలో గురువారం ఫారెస్టు డిప్యూటీ రేంజ్ అధికారి ప్రభాకర్ వన్య ప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, విద్యుత్ వైర్లు, ఉచ్చులు, ఉరులు బిగించి వన్యప్రాణులను చం పితే కఠినచర్యలు తీసుకొంటామన్నారు.
మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం క్రమంగా పెరుగుతోంది. లక్షెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరించగా, తాజాగా బెల్లంపల్లి ఫారెస్టు డివిజన్ పరిధిలో చిరుతపులి కనిపించింది. అటవీ అధికారులు పులుల సంచారాన్ని ద్రువీకరించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఎప్పు డు ఏం జరుగుతోందనని భయాందోళనకు గురవుతు న్నారు.
దివ్యాంగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్స వంలో భాగంగా దివ్యాంగులను సన్మానిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల పరి రక్షణ హక్కులపై అవగాహన కలిగి ఉం డాలని, ప్రత్యేక కమ్యూనిటీ హాలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలో మంగళవారం అధికారులు, పాఠ శాలల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాయల్ టాకీస్ చౌరస్తా నుంచి సీసీసీ కార్నర్ వరకు ర్యాలీ సాగింది. రోడ్లపై చెత్తను వేయవద్దని, మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.
పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్ల నిధులను కేటాయించినట్లు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లతో ప్రణాళి కలు తయారు చేశామన్నారు.