Home » Mamata Banerjee
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 'మా-మాటి-మనుష్' (తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని ఓటర్లను కోరారు.
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు 'మరమరాల మిక్చర్' ప్రధానాంశంగా నడుస్తున్నాయి. మోదీ, మమతా బెనర్జీ మధ్య ఒకప్పుడు కేవలం ఆహారం, ఆరోగ్యం గురించి ఇదే మిక్చర్ మీద జరిగిన చర్చ, ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజవర్గమైన భవానీపూర్లో ఆదివారంనాడు పాదయాత్ర జరిపారు. స్థానికులను కలుస్తూ ముందుకు కదిలారు. ఈ పాదయాత్రలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ పేదలను పట్టించుకోరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ సంపదను ధనికులకు దోచుపెడుతున్నారంటూ విమర్శించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా చేసిన హింసాత్మక వ్యాఖ్యలపై లీగల్ కేసు వేయనున్నట్టు పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ తెలిపారు.
మే ఐదో తేదీ తర్వాతి నుంచి పశ్చిమ బెంగాల్ మహిళలు రాత్రి ఒంటి గంట తర్వాత కూడా భయం లేకుండా రోడ్లుపై తిరగొచ్చని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని పూర్బ బర్ధమాన్ జిల్లాలోని జమాల్పూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో సీఆర్పీఎఫ్ సాయుధ వాహనాలను మోహరించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఇది ప్రజాస్వామ్య పండుగ, ఎవర్నీ చంపే పండుగ కాదు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ప్రారంభంలో కోల్కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు మధ్యలోకి ముఖ్యమంత్రి చొరబడి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టటం సరికాదని వ్యాఖ్యానించింది.
పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక చోట ఆగి 'ఝుల్మురి' కొనుక్కు తినడాన్ని ఒక 'డ్రామా'గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కొట్టివేశారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇదంతా జరిగిందా అని ప్రశ్నించారు.
మహిళలకు హక్కులు దక్కకుండా కాంగ్రెస్తో టీఎంసీ కుమ్మక్కై బిల్లును అడ్డుకుందంటూ ప్రధాని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తాజాగా విమర్శించగా, మహిళలకు ప్రాతనిధ్యం కల్పించడంలో టీఎంసీ ఛాంపియన్ అని మమతా బెనర్జీ తిప్పికొట్టారు.