Home » Mamata Banerjee
శ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నుంచి ఆ పార్టీలోని కింద స్థాయి నేతలు వరకు అందరిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సందేశ్కాలీలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, చోప్రాలో టీఎంసీ నేత తాజ్ముల్ల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి.
కేంద్ర బడ్జెట్లో పశ్చిమ బెంగాల్కు నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర విభజన ప్రయత్నాలపై నిలదీస్తానంటూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఆ రాష్ట్ర సీఎం మమత మధ్యలోనే వాకౌట్ చేశారు.
'నీతి ఆయోగ్' సమావేశం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ నేపథ్యంలో నీతి ఆయోగ్ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తప్పుపట్టడంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ''సమావేశంలో మీరు లేనే లేరు...ఎలా తప్పుపడతారు?'' అని జైరామ్ రమేష్ను ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన 'నీతి ఆయోగ్' సమావేశంలో తాను మాట్లాడుతుండగా 'మైక్' కట్ చేశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? ఇందులో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మమత వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ సైతం నిర్ధారించింది.
రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కొందరు..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు కేటాయింపుల్లో 'వివక్ష' చూపారంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలు ఈసారి 'నీతి ఆయోగ్' లో ఆ విషయాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. శనివారంనాడు ఢిల్లీలో జరిగే ''నీతి ఆయోగ్'' సమావేశంలో పశ్చిమబెంగాల్ పట్ల చూపుతున్న రాజకీయ వివక్షపై నిరసన తెలపనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్ట్ కొలీజియం.. కలకత్తా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తుల పదవీ కాలాన్ని పొడగించాలని నిర్ణయించింది. హైకోర్టులో పని చేస్తున్న తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తుల పని వేళలను సైతం ఏడాదిపాటు పొడగించాలని సిఫార్సు చేసింది.
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని హింసతో బాధితులుగా మారిన వారికి కోల్కతాలో ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. దిశానిర్దేశం లేని, ప్రజావ్యతిరేక, రాజకీయ పక్షపాత బడ్జెట్ అని అభివర్ణించారు.