Home » Mamata Banerjee
శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆందోళనకు దిగిన వైద్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎదుట ‘వైద్యులు’ తమ ఆరు డిమాండ్లను ఉంచారు. ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డాను డిమాండ్ చేశారు.
ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిపై దాడి ఘటనకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అటు పోలీసులను ఇటు ఆసుపత్రి ఉన్నతాధికారులను శుక్రవారం కోల్కతా హైకోర్టు ఆదేశించింది. దాదాపు 7 వేల మంది గుంపుగా ఆసుపత్రిపై దాడికి తెగబడితే.. పోలీసుల నిఘా వైఫల్యాన్ని సూచిస్తుందని కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం అభిప్రాయపడ్డారు.
కోల్కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై పశ్చిమబెంగాల్ అట్టుడుకుతోంది. బాధితులకు న్యాయం చేయాలంటూ అధికార, ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి.
కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కేంద్ర భద్రత దళాలను మోహరించాలని ఢిల్లీలోని హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భ్లలాతోపాటు సీబీఐ డైరెక్టర్కు బీజేపీ నేత, ఎమ్మెల్యే సువేందో అధికారి విజ్ఞప్తిచేశారు.
ప్రతిపక్షాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒంటికాలిపై లేశారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ మృతి అంశాన్ని రాజకీయం చేయడంపై ధ్వజమెత్తారు. సీపీఎం, బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బెంగాల్ను మరో బంగ్లాదేశ్లా మారుస్తారా ఏంటీ అని విరుచుకుపడ్డారు. నేను మీకో విషయం చెప్పదలుచుకున్నాను.. అధికారం కోసం నాకు అత్యాశ ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోల్కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వైద్యురాలి మృతి అసహజ మరణమని.. ఈ నేపథ్యంలో కేసు ఎందుకు నమోదు చేయలేదని పశ్చిమ బెంగాల్లోని అధికార మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించింది.
ధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి.. ఆమె ప్రాణాన్ని బలిగొన్నానన్న దోష భావన లేదు! దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం లేదు!! పోలీసులు తనను పట్టుకున్నప్పుడు కూడా అతడి కళ్లల్లో ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు! వారు తనను ప్రశ్నిస్తున్నప్పుడు నిర్వికారంగా సమాధానాలు చెప్పాడు.
నగరంలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో హత్యాచారం కారణంగా మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రైయినీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులకు తొలుత ఆసుపత్రి ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తెలింది.
ట్రైనీ వైద్యురాలు హత్య ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన భయానకమైనదన్నారు. అలాగే హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు విస్తుపోయే అంశాలను వివరించారు. సంజయ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తే.. ఏ మాత్రం బాధ పడలేదని, పశ్చాతాపం అనేది అతనిలో ఏ కోశానా కనిపించలేదని పేర్కొన్నారు.