Home » Mamata Banerjee
కోల్కతా వైద్యురాలి మృతిపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైద్య సంఘాలు ఆందోళనకు దిగాయి. వీలైనంత త్వరగా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని కోరుతున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ చేసి, దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ధ్వంసం చేశారు
సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాలేజీ విద్యార్థి కీర్తి శర్మ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం కోల్కతా మహానగరంలో లేక్ టౌన్లోని నివాసంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
నా బిడ్డ చనిపోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీధుల్లోకి వచ్చి చాలా బాగా మాట్లాడారు. నా బిడ్డ మృతికి న్యాయం జరగాలని ఆందోళన కూడా చేపట్టారు. అదే సమయంలో ప్రజల ఆగ్రహాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ద్వంద్వ విధానం అమలు చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మృతురాలి తండ్రి ప్రశ్నల వర్షం కురిపించారు.
కోల్ కతా వైద్యురాలి మృతి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. మృతురాలికి న్యాయం జరగాలని, వీలైనంత త్వరగా నిందితుడిని ఉరి తీయాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదే అంశంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీకి మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
ఈస్ట్ బెంగాల్ వెర్సస్ మోహన్ బాగాన్ డెర్బీ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫుట్బాల్ మ్యాచ్ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. మ్యాచ్కు తగిన భద్రత కల్పించలేమని కోల్కతా పోలీసులు అసక్తత వ్యక్తం చేయడంపై బీజేపీ మండిపడింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య చర్యకు దిగింది. సుమారు 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
కోల్కతా ట్రైనీ డాక్టర్ పాశవిక అత్యాచారం, హత్య కేసుపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు బాధితురాలు 'నిర్భయ' తల్లి ఆశా దేవి ఘాటుగా స్పందించారు. కేసును సమర్ధవంతంగా పరిష్కరించడం, చర్యలు తీసుకోవడంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని, ఆమె తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో బెంగాల్ సీఎం మమత రాజీనామా చేయాలంటూ శుక్రవారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ర్యాలీలు చేపట్టింది. బెంగాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని..
ఆర్జీ కర్ వైద్యకళాశాల, ఆస్పత్రిపై బుధవారం అర్ధరాత్రి దుండగులు పాల్పడిన దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది.
పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగాజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలో చట్టం లేదని లేకుండా పోయిందని మండిపడ్డారు. ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితులు చాలా మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు.