Home » Mamata Banerjee
రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనిఖీలు చేశారు. కోల్కతాలోని ఆయన ఇంట్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేశారు.
అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ వ్యవహారాలను పర్యవేక్షించే కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ రెయిడ్స్ను నిర్వహించింది. ఇదే సమయంలో ఆయన ఇంటికి పశ్చిమ బెంగాల్ సీఎం వెళ్లడం కలకలానికి దారి తీసింది.
ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఈసీ అన్నిరకాల తప్పుడు పద్ధతులను అనుసరిస్తోందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. అర్హులైన వారిని చనిపోయినట్టుగా చూపిస్తోందని.. వృద్ధులు, అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారిని విచారణకు రావాలని బలవంతం చేస్తూ వేధిస్తోందన్నారు.
ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని టీఎంసీ బాస్ బెదిరించారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర తప్పుపట్టారు. తాము తలుచుకుని ఉంటే మమతా బెనర్జీని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చోటు నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసేవాళ్లమని అన్నారు.
పధ్నాలుగేళ్ల క్రితం ప్రజలు భయంగుప్పిట్లో ఉన్నప్పుడు తాము బంకురలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, నీటిసంక్షోభాన్ని అధిగమించేందుకు ఎంతో చేశామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీని తప్పుపట్టారు.
అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. మొదట అతడు కోల్కతా చేరుకున్నాడు. అయితే కోల్కతాలో మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రేక్షుకులు, మెస్సీ అభిమానులు విధ్వంసానికి దిగారు.
పశ్చిమబెంగాల్లో ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి పర్యటన సందర్భంగా కోల్కతా స్టేడియనంలో అభిమానులు విధ్వంసం సృష్టించడంతో బీజేపీ టీఎంసీపై విమర్శలు గుప్పించింది.
శనివారం ఉదయం మెస్సి సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయనను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.
బెల్డాంగలో ప్రతిపాదిత బాబ్రీ మసీదుకు కబీర్ శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఆయన నుంచి బాబ్రీ మసీదు ప్రకటన వెలువడగానే పార్టీ నుంచి కబీర్ను సస్పెండ్ చేస్తున్నట్టు టీఎంసీ ప్రకటించింది.
ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంత హడావిడిగా చేపట్టటాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. హడావిడి వ్యవహారంతో ఓటర్ల జాబితా నుంచి ప్రజలను తప్పించాలని చూస్తే బీజేపీని విడిచిపెట్టేది లేదని అన్నారు.