Home » Mamata Banerjee
కోల్కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వం తరఫున వాదించ వద్దని కపిల్ సిబల్కు అధిర్ రంజన్ చౌదరి హితవు పలికారు. ఈ కేసు నుంచి వైదొలగాలని ఆయనను అభ్యర్థించాలనుకుంటున్నారన్నారు.
వైద్యురాలి మృతి కేసులో తొలి నుంచి కోల్ కతా పోలీసుల తీరు సందేహాదాస్పదంగా ఉంది. వైద్యురాలి కేసులో పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే, సీబీఐ అధికారులు, ఆ వైద్యురాలి పేరంట్స్ వెర్షన్ మరోలా ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 గంటల సమయం పట్టడంతో సందేహాలు వస్తోన్నాయి.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్కు దుర్గా పూజా కమిటీలు సంఘీభావం తెలిపాయి. ఇందుకు అనుగుణంగా టీఎంసీ ప్రభుత్వం వార్షిక దుర్గా ఫెస్టివల్కు కేటాయించిన గ్రాంట్లను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
యావద్దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతిలోకి నెట్టిన కోల్కతా వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్ ఆస్పత్రిలో క్రైమ్ న్సీన్ను మార్చేశారని సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది.
దేశవ్యాప్తంగా కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్ర మఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ఆమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు.
కోల్కతా ఆర్జీ కర్(RG Kar) ఆస్పత్రిలో మహిళా మెడికో హత్యోదంతం మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. మమతా ఇమేజ్ బాగా దెబ్బతింది.
కోల్కతా మహానగరంలో దక్షిణ శివారు ఆనందపూర్ గ్రామంలోని రహదారి పక్కన పొదల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కోల్కతా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మంగళవారం కోల్కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్తో అత్యంత సన్నిహితంగా మెలిగే ఏఎస్ఐ అరుప్ దత్తా సీబీఐ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు.
కోల్ కతా వైద్యురాలి మృతి ఘటన ప్రకంపనలు రేపుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని యావత్ భారతవని కోరుతోంది. వైద్యురాలి మృతికి సంఘీభావంగా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్టేటస్ను బ్లాక్ కలర్గా మార్చారు. తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరారు.
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోల్కతా కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది.