Home » Mallikarjun Kharge
నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పార్టీకి ఒక సవాలని శుక్రవారంనాడిక్కడ జరిగిన సీడీబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
పార్లమెంట్ సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు.
మణిపూర్ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయి, సొంత గడ్డపైనే అభద్రతా భావంతో గడుపుతున్నారని ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని వారు కోల్పోయారని రాష్ట్రపతి దృష్టికి ఆయన తెచ్చారు.
దేశంలో బీజేపీ, ఆర్ఎ్సఎస్ రాజకీయంగా ప్రమాదకరమైనవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
జార్ఖాండ్లో హెలికాప్టర్లు రాబందుల్లా ఎగురుతున్నాయని, ఇక్కడ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అలా వచ్చారా? అసోం, మధ్యప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు వాలిపోతూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు.
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.
దేశ భవిష్యత్తును నిర్ణయించే కొన్ని ఎన్నికలు చాలా కీలకమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 1946లో కూడా దేశభవిష్యత్తును మార్చే ఎన్నికలు జరిగాయని, అధికారదాహంతో 'ముస్లిం గ్యాంగ్' ఉచ్చులో చిక్కుకున్న కాంగ్రెస్ దేశప్రజలను వంచించిందని, ఆ తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలుసునని చెప్పారు.
ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్షాలను అణచేయడం.. ఇవే ప్రధాని మోదీకి తెలుసంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చాలా దయనీయంగా ఉందని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు ఆ పార్టీని ఎవరూ నమ్మరని చెప్పారు. గతంలోనూ కాంగ్రెస్ వాగ్దానాలు చేయడమే కానీ అమలులో మాత్రం విపలమైందన్నారు. నాగపూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తనను ఆరోసారి గెలిచిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
మహారాష్ట్రలో మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమి సమస్త బలగాలను మోహరించి గెలుపుకోసం శ్రమిస్తున్నాయి.