Home » Malkajgiri
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లజోలికొస్తే సహించేది లేదు ఖబడ్దార్ అంటూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(BJP Malkajigiri MP Etala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూల్చివేతలను అడ్డుకుని తీరతామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు శని, ఆదివారాలు వస్తే బిక్కుబిక్కుమని జీవితాలు గడిపే దుస్థితి నెలకొందన్నారు.
సచివాలయం బఫర్ జోన్లో కట్టలేదా.. అంటూ ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం అత్తాపూర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
ట్రెయినింగ్ సెంటర్ల పేరుతో ఉన్మాదులకు శిక్షణ ఇస్తుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్(Secunderabad)లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఎంపీ ఈటల సందర్శించారు.
విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్(Pochampally- Mansoorabad) వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో సామాన్య ప్రజల్లో భయం సృష్టిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) మండిపడ్డారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నివాసాలను కూల్చివేస్తామంటూ అధికారులు పలు కాలనీల ప్రజలకు నోటీసులు ఇవ్వడంతో శుక్రవారం ఆయన మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ది వ్యాంగుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(BJP Malkajgiri MP Etala Rajender) డిమాండ్ చేశారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు స్పందిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.
పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఎంపీగా చూస్తూ ఊరుకోవాలా అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఆయన సరూర్నగర్ చెరువును బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వరదల్లో మరణించిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తక్షణమే రూ. 50లక్షల నష్టపరిహారం ప్రకటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) డిమాండ్ చేశారు.
చెరువు, బఫర్ జోన్లలో నిర్మించిన పెద్దల అక్రమ నిర్మాణాలను హైడ్రాతో కూల్చివేయించడం సంతోషమే కానీ.. అదే ముసుగులో సామాన్యుల నిర్మాణాలను పడగొడతామంటే ఊరుకోబోమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.