Home » Mahesh Kumar Goud
త్వరలో అన్ని రాజకీయ పదవులను భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్(PCC President Mahesh Kumar Goud) అన్నారు. కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్రెడ్డిలు శనివారం మహేష్ కుమార్గౌడ్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలకు టీపీసీసీ ఆదివారం శ్రీకారం చుడుతోంది.
Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. స్థానిక సంస్థలే లక్ష్యంగా మహేష్ కుమార్ గౌడ్ పర్యటన కొనసాగనుంది. ఈపర్యటనలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలను వంచించిందని, వారికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జన గణనలో కులగణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
సంక్రాంతి తర్వాత టీపీసీసీ కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. జనవరి మొదటి వారంలో ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ సహా కార్యవర్గాన్ని ఏఐసీసీ ఖరారు చేయనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వన దుర్గా దేవిని దర్శించుకున్నారు.
Telangana: కేంద్రమంత్రి అమిత్షాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ పెట్టాయన్నారు. అమిత్ షాను సపోర్ట్ చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఖరి కూడా ప్రజలకు అర్థమైందన్నారు.
సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి బన్నిని విడుదల చేశారు. అయితే ఎపిసోడ్ కీలక ములుపులు తిరుగుతోంది.
Telangana: ఫార్ములా ఈకార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు అవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు, కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు.