Home » Mahabubnagar
కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
SLBC Tunnel Tragedy: గత వారం రోజులుగా టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. చివరకు టన్నెల్లో ప్రమాదంలో ఆ ఎనిమిది ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వెనక టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నార్సిమోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎన్ఎంఐఎంఎ్స) వర్సిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 18 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు.
గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ జనరల్ గురుకులంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు.
మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం(73) కన్నుమూశారు. 22 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆదివారం సాయం త్రం గుండెపోటు రావడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు.
విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది సీపీఆర్ చేస్తూ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
వసతి గృహం వాష్రూంకు వెళ్లిన బాలిక అక్కడ కెమెరా ఆన్ చేసి ఉన్న సెల్ఫోన్ కనిపించడంతో దిగ్ర్భాంతికి గురైంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి.. పోలీసులకు పట్టిస్తారనే ఆశతో తండ్రి వయసున్న ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది.