Home » Mahabubabad
రాష్ట్రంలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. జ్వరాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం బారిన పడి మంగళవారం వరంగల్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థితోపాటు మహబూబ్నగర్ జిల్లాలో ఓ 58 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.
జేఎన్టీయూ కాలేజీలో ఇంజనీరింగ్ సీటంటే ఏ విద్యార్థైనా ఎగిరి గంతేస్తాడు. కానీ, ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కాలేజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
తాను కన్నతల్లి కాకపోయినా పెంచి పెద్ద చేసిన కుమారుడి మరణాన్ని సవతి తల్లి జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మృతదేహం వద్ద ఏడుస్తూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం కుక్కలు పెట్రేగిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఓ పిచ్చికుక్క ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు సహా ఐదుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచగా, మహబూబాబాద్ జిల్లాలో కుక్క దాడిలో తండ్రీ, కొడుకులు గాయపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోని శ్రీముసలమ్మ ఆలయ ఈవో భోగోజు భిక్షమాచారి ఆదివారం ఏసీబీ వలకు చిక్కారు.
గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరికి మహబూబాబాద్ జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారానికి చెందిన బానోత్ కిరణ్కుమార్ అలియాస్ దేవా, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన బాదావత్ సూర్య..
మహబూబాబాద్ జిల్లాలో మారుమూలన ఉన్న ఉల్లేపల్లి భూక్యా తండాకు చెందిన గిరిజన యువకుడు, మౌంటేనీర్ భూక్యా యశ్వంత్ (Mountaineer Bhukya Yashwant) 6,250 మీటర్ల ఎత్తయిన మౌంట్ క్యాంగ్ యాట్సీ-2 అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్నిశిఖరంపై నిలబెట్టారు.
విజయవాడ యార్డ్ పరిధిలో మరమ్మతుల కారణంగా పినాకిని, జనశతాబ్ధి రైళ్లను(Pinakini, Janashtabdi trains) రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
కాంబోడియా జైల్లో నెల రోజులు తాను బాతు గుడ్లు.. వట్టి చేపలు తిని బతికానని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన మున్సిఫ్ ప్రకాశ్ చెప్పాడు. చేసిన పనికి డబ్బులివ్వకపోగా తానే బాకీ పడ్డానంటూ కంపెనీ తనపై కేసుపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లి.. అక్కడ సైబర్ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణవాసి మున్సిఫ్ ప్రకాశ్కు ఆ చెర నుంచి విముక్తి లభించింది.