Home » Madhya Pradesh
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు, సిమెంట్ దిమ్మలు ఇంకా ప్రత్యక్షమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ సమీపంలోని ప్రేమ్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలెండర్ను ఆదివారం రైల్వే లోకో పైలట్ గమనించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని లోక్ సభపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు.
వరుస తోడేళ్ల దాడితో ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తోడేళ్లను పట్టుకునేందుకు ‘ఆపరేషన్ బేడియా’ను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా పలు తోడేళ్లను అటవీ శాఖ అధికారులు బంధించారు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో(Jabalpur) శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్ప్రెస్ రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం(Train Accident) స్టేషన్కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5.50 గంటలకు జరిగింది.
యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్ను దుండగులు అటకాయించి దోచుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని సాగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 15 వందలకుపైగా ఐఫోన్లు చోరీ అయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి సంజయ్ ఉకే వెల్లడించారు.
రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ రాజస్థాన్ నుంచి, జార్జి కురియన్ మధ్యప్రదేశ్ నుంచి మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బుల్డోజర్ న్యాయం’ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దానిని వెంటనే నిలుపుదల చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో మహిళల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. బస్సులు, రైళ్లలో డాన్సులు వేసే మహిళలతో పాటూ ఇళ్లల్లో చిత్ర చిత్రమైన పనులు చేసే మహిళను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా...
శ్రీలంక, బంగ్లాదేశ్లో జరిగిన మాదిరిగా ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకి చొరబడతారంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ సింగ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులు శివలింగాన్ని తయారు చేయడానికి ఓ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ క్రమంలోనే భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిపోయి(wall collapsed) పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.