Home » Lucknow
బంధుమిత్రుల పలకరింపులు, మేళతాళాల మధ్య చిందులతో హడావుడిగా ఉన్న పెళ్లి పందిరిలోకి అనుకోని ఓ అతిథి ప్రవేశించింది. ఆ అనుకోని అతిథి ఎవరో కాదు..
Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర సమయంలో సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కొత్త కేసు కాంగ్రెస్ అగ్రనేతకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
న్యూ ఇయర్ వేళ ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. లక్నోలోని ఓ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు హత్యకు గురయ్యారు. ఈరోజు ఉదయం హోటల్ సిబ్బంది గదిలోకి వచ్చి చూడగా 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.
అకోలాలో జరిగిన మీడియా సమావేశంలో సావర్కర్ను కించపరచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే కేసు వేశారు. వీరసావర్కర్ను ఆంగ్లేయుల సర్వెంట్గా, పెన్షనర్గా రాహుల్ పేర్కొన్నారని, తన వ్యాఖ్యల ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడారని ఆరోపించారు.
అక్రమ గ్యాస్ గోదాములో అనుకోకుండా భారీ పేలుడులో సంభవించింది. దీంతో నలుగురు కార్మికులతోపాటు ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పోలీసుల కుమ్మక్కుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
లక్నోలోని పీజీఐ పోలీస్స్టేషన్ పరిధి లోని కిసాన్ పథ్ వద్ద వేగంగా వెళ్తున్న కారు స్కూటర్పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ మీద ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూటర్ను ఢీకొట్టిన తర్వాత ఆ కారు డ్రైవర్ చేసిన పని చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భర్త దీర్ఘాయుష్షు కోసం నిష్ఠగా సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఆమె అదే రోజు రాత్రి భర్తను హత్యచేసింది.
ప్రయాగ్రాజ్లోని ఆలోప్ శంకరీ దేవి, బడే హనుమాన్, మంకమేశ్వర్తో సహా సంగమ్ నగరంలోని పలు ప్రముఖ దేవాలయాలు ప్రసాదాల విషయంలో పలు ఆంక్షలను ప్రకటించాయి. ప్రయాగ్రాజ్లోని ప్రముఖ లలితా దేవి ఆలయంలో..
నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారీ వర్షాల కారణంగా యూపీలోని మేరట్లో శనివారం మూడంతస్తుల భవనం కూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ఐదుగురు గాయపడ్డారు.