Home » Lok Sabha
బిల్లుపై చర్చలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బిల్లుకు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షం పదపదే అభ్యంతరాలు చెబుతుండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముస్లిం కమ్యూనిటీ సంక్షేమం నుంచి ఏ అనివార్యతల కారణంగా వెనక్కి మళ్లారని ప్రశ్నించారు.
వక్ఫ్ బిల్లు బుజ్జగింపు బిల్లు కాదని, అభ్యున్నతి బిల్లు అని ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండే అన్నారు. ఈ బిల్లు దేశం కోసం ప్రవేశపెట్టిన బిల్లే కానీ నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా తీసుకువచ్చినది కాదని చెప్పారు.
బిల్లులో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణతో సహా అన్ని సవరణలకు టీడీపీ సానుకూలంగా ఉంది. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడులైన్ల విప్ను కూడా టీడీపీ జారీ చేసింది.
వక్ఫ్ సవరణ బిల్లు-2024ను బుధవారంనాడు ప్రశ్నోత్తరాల సమయం అనంతరం లోక్సభలో ప్రవేశపెడతారని, దీనిపై 8 గంటలసేపు చర్చ జరపాలని బీఏసీ సమావేశం నిర్ణయించిందని, అవసరాన్ని బట్టి సమయం పొడిగించే వీలుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
కేంద్రప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లను ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపింది.
కేంద్రం త్వరలో 'సహకార్ ట్యాక్సీ' సేవను ప్రారంభించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విధానంలో స్థానిక సహకార సంఘాలు అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి, తద్వారా డ్రైవర్లకు ఎక్కువ లాభాలు, ఆర్థిక భద్రత మరియు స్వాతంత్ర్యం కలుగుతుంది
పార్లమెంటు వెలుపల మీడియాతో బుధవారంనాడు ఆయన మాట్లాడుతూ, అసలేం జరుగుతోందో అర్ధం కావడం లేదని, మాట్లాడేందుకు అవకాశం ఇమ్మని ఆయనను (స్పీకర్) కోరుతున్నప్పటికీ అనుమతించడం లేదని చెప్పారు. ఇది సభ నడిపే పద్ధతి కాదన్నారు.
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్పై కీలక ప్రకటన చేశారు. బుధవారం లోక్ సభకు లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య రిటైర్మెంట్ ఏజ్లో ఎందుకు తేడాలు ఉన్నాయన్న దానిపై కూడా స్పందించారు.
ధర్మేంద్ర ప్రధాన్పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్కు నిధులను ఎన్ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
బడ్జెట్ సమావేశాల సెకెండ్ సెషన్ సోమవారంనాడు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ డీఎంకే వైఖరిపై విరుచుకుపడటంతో పార్లమెంటులో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. డీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు సభ వాయిదా పడింది.