• Home » Lok Sabha Elections

Lok Sabha Elections

Lok Sabha Polls: బారామతిలో ఫ్యామిలీ వార్.. గెలుపు ఎవరిదంటే..?

Lok Sabha Polls: బారామతిలో ఫ్యామిలీ వార్.. గెలుపు ఎవరిదంటే..?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. మూడు విడతలు ఇప్పటికే ముగిశాయి. పోలింగ్ ముగిసిన మూడోవిడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహారాష్ట్రలోని బారామతి.. ఇక్కడ ఫ్యామిలీ వార్ నడుస్తుండగా.. విజయంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ నెలకొంది.

Muslims: ముస్లింలకు మోదీ వ్యతిరేకమా? ప్రధాని ఏమన్నారంటే

Muslims: ముస్లింలకు మోదీ వ్యతిరేకమా? ప్రధాని ఏమన్నారంటే

తాను ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందంటూ తాను చేసిన వ్యాఖ్యను సమర్థించుకుంటూ.. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో ఆ విషయం ఉందన్నారు

AIMIM: పది లోక్‌సభ స్థానాల్లో మజ్లిస్‌ పోటీ

AIMIM: పది లోక్‌సభ స్థానాల్లో మజ్లిస్‌ పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్‌తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు.

PM Modi: ఓట్‌ జిహాదా.. రామరాజ్యమా?.. మోదీ సూటి ప్రశ్న

PM Modi: ఓట్‌ జిహాదా.. రామరాజ్యమా?.. మోదీ సూటి ప్రశ్న

కాంగ్రెస్‌ పార్టీ ‘ఓట్‌ జిహాద్‌’ను ప్రోత్సహిస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముస్లింలను కోరుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌, ఖర్గోన్‌లలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో మోదీ ప్రసంగించారు. ‘‘భారతదేశంఈ రోజు ఒక కీలక మలుపు ముంగిట నిలిచింది. దేశంలో ఓట్‌ జిహాద్‌ కొనసాగాలా లేక, రామ రాజ్యం కొనసాగాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి’’ అని ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

Delhi: పోలింగ్‌ శాతాల్లో తేడాలపై డౌట్‌.. ఇండియా కూటమి నేతలకు ఖర్గే లేఖ

Delhi: పోలింగ్‌ శాతాల్లో తేడాలపై డౌట్‌.. ఇండియా కూటమి నేతలకు ఖర్గే లేఖ

లోక్‌సభ మొదటి, రెండో దశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్‌ శాతాల్లో భారీ వ్యత్యాసాలు ఉండడం ఆ సంస్థ నిష్పక్షపాతతపై అనుమానాలను కలిగిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అన్నారు.

Lok Sabha Polls 2024: 93 లోక్‌సభ స్థానాల్లో.. ప్రశాంతంగా ముగిసిన మూడో దశ పోలింగ్

Lok Sabha Polls 2024: 93 లోక్‌సభ స్థానాల్లో.. ప్రశాంతంగా ముగిసిన మూడో దశ పోలింగ్

ఢిల్లీ: లోక్‌సభ మూడో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 93 పార్లమెంటు స్థానాలలో మూడో దశ పోలింగ్‌ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్లు ఈసీ వెల్లడించింది.

Lok Sabha Polls: ఓటు వెయ్యండి.. మందు బాటిల్‌పై డిస్కౌంట్ పొందండి..

Lok Sabha Polls: ఓటు వెయ్యండి.. మందు బాటిల్‌పై డిస్కౌంట్ పొందండి..

‘బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది’.. ‘మార్పు కోరుకోవడం మాత్రమే సరిపోదు.. మీరు వెళ్లి ఓటు వేయడం ద్వారా మార్పు చేసుకోవాలి’.. ‘బలమైన దేశాన్ని సృష్టించేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అనే నినాదలు మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే, చాలా మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు.

AP Elections: ఏపీలో సర్వేల ప్రకంపనలు.. సోషల్ మీడియాలో వైరల్..!

AP Elections: ఏపీలో సర్వేల ప్రకంపనలు.. సోషల్ మీడియాలో వైరల్..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం. గెలిచేదెవరు.. ఓడేదెవరు.. చర్చంతా ఇదే. ఈ సమయంలో సోషల్ మీడియాలో కొన్ని సర్వేలు హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు ఓ 10 నివేదికలు పలు సర్వే సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఏ ఫలితం చూసినా ఒకేలా ఉండటంతో రాజకీయ పార్టీల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.

ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!

ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!

ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలు రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏప్రియల్ 21 నుంచి మే5 మధ్యన నిర్వహించినట్లు పయోనీర్స్ పేరిట ఓ సర్వే చక్కర్లు కొడుతోంది. ఏప్రియల్ నెలలోనూ ఈ సంస్థ పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సర్వేతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన సర్వేలో కొన్ని మార్పులు కనిపించాయి. ఏపీలో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంటుందని ఈ సర్వే పేర్కొంది.

Lok Sabha Polls: ఆ రెండు నియోజకవర్గాలే టార్గెట్.. ప్రియాంకకు గెలుపు బాధ్యతలు..

Lok Sabha Polls: ఆ రెండు నియోజకవర్గాలే టార్గెట్.. ప్రియాంకకు గెలుపు బాధ్యతలు..

దేశ ప్రధాని ఎవరుండాలనే ప్రాతిపదికన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే, ఇండియా కూటములు అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. మాదంటే.. మాదంటూ ఎవరికి వాళ్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. యూపీలో మెజార్టీ సీట్లు గెలవాలి. ఏ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటితే ఆ పార్టీనే గెలుపునకు దగ్గరవుతుంది. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో అమేథి, రాయ్‌బరేలీ సీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి