Home » Lok Sabha Election 2024
లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపీ గౌరవ్ గొగోయ్కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్ విప్గా సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్, విప్లుగా మాణిక్కం ఠాగూర్, మహమ్మద్ జావేద్లను నియమించింది.
కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్గా గౌరవ్ గొగోయ్ను నియమించింది. ఇక సభలో చీఫ్ వీప్గా కొడిక్కినల్ సురేష్ను, అలాగే వీప్లుగా మాణిక్కం ఠాగూర్, జావేద్ను ఎంపిక చేసింది.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన పీఠమెక్కి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
జీవితాన్ని మెదక్(Medak) పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తానని ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) చెప్పారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలపై రఘునందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 240 సీట్లతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి పాలవడంపై సీపీఎం పార్టీ ఆత్మ విశ్లేషణ చేసుకుంది.
జమ్మూ కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడు మృతి చెందాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని మోడర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి.
మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆగస్ట్లో కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ జరగవచ్చునన్నారు.
లోక్సభలో కాశ్మీరి నేత ఇంజినీర్ రషీద్, ఖలిస్థాన్ అనుకూల నాయకుడు అమృత్పాల్ సింగ్ సభ్యులుగా ప్రమాణం చేశారు. శుక్రవారం పార్లమెంట్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణం చేశారు.
ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్.. జులై 5వ తేదీ అంటే శుక్రవారం లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు. నాలుగు రోజుల పెరోల్పై ఆయన బయటకు రానున్నారని సమాచారం. ఆ క్రమంలో లోక్సభ సభ్యుడిగా ఆయన ప్రమాణం చేయనున్నారని తెలుస్తుంది.