Home » Lok Sabha Election 2024
దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి లీడ్లో దూసుకుపోతోంది. ఇండియా కూటమికి, ఎన్డీయేకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తోంది.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పశ్చాత్తాపపడుతున్నారా? ఎన్నికల్లో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్సభ ఎన్నికల్లో తాను పెద్ద తప్పు చేశానని అన్నారు.
ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.
మోదీ ప్రభుత్వం ‘ఆర్టికల్ 370’ని రద్దు చేసి.. నేటికి అంటే ఆగస్ట్ 5వ తేదీకి అయిదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఆర్ఎస్ పురాలోని బానా సింగ్ స్టేడియంలో ఏకాత్మ మహోత్సవ్ ర్యాలీని బీజేపీ చేపట్టనుంది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే రోజున అంటే.. 2019, ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
పోలింగ్ శాతాల్లో భారీగా తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలను ఆదివారం ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వచ్చాయి.
ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ ప్రమాదంలో దాదాపు 160 మందికిపైగా మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం కేరళలోని వయనాడ్, ముప్పడిలో పర్యటించనున్నారు.
కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. బుధవారం ఉదయానికి మృతుల సంఖ్య 156కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక గాయపడిన 130 మంది వయనాడ్లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుకున్న విధంగా ఫలితాలను సాధించపోవడానికి కారణాలను సమీక్షించుకుని, భవిష్యత్లో ఓటమి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండేను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇప్పటి వరకు యూపీ అసెంబ్లీలో సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష నేతగా వ్యవహించారు. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు.
వారీస్ పంజాబ్ దే అధ్యక్షుడు, ఖదూర్ సాహెబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ చన్నీ మండిపడ్డారు. లోక్సభ సభ్యుడిగా గెలిచిన అమృత్ పాల్ సింగ్ను నిర్బందంలో ఉంచడం ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.