Home » Lok Sabha Election 2024
మరికొద్ది రోజుల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ బెయిల్ పై విడుదల కావడంతో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.
ఆరు నెలల అనంతరం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.
గత ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశామని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు వెల్లడిస్తారన్నారు. 75 శాతం కంటే తక్కువ మంది ప్రజలు అలా కాదని సమాధానమిస్తే.. తాను లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా వరుసగా వివిధ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఆ క్రమంలో ప్రఖ్యాత జార్ట్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మంగళవారం రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.
వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లను ప్రకటించింది. హరియాణా ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పేరు ఈ జాబితాలో ఉంది. ఆయన లాడ్వా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.
వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో వెళ్లేందుకు సమాయత్తమయ్యాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం స్పందించారు.
కుల గణనపై దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతుంది. అలాంటి వేళ.. కుల గణనపై బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టత ఇచ్చింది. కుల గణన అనేది సున్నితమైన అంశమని పేర్కొంది. ఈ అంశం సామాజిక వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలని తెలిపింది.
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో తాను ఓటమి పాలైనా.. అసలు విజయం మాత్రం తనదేనని ఆమె స్పష్టం చేశారు. అమేఠీ లోక్సభ సభ్యురాలిగా గతంలో ఆ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఈ సందర్బంగా స్మృతి ఇరానీ సోదాహరణగా వివరించారు.