Home » Lok Sabha Election 2024
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన పామర్రులో అధికారం మాదంటే మాదేనంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కులమతాలకు అతీతంగా పేదలకు అందించిన పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలతో వైసీపీ అభ్యర్థి రెండోసారి గెలుపొందటం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ప్రగాల్భాలు పలుకుతుండగా, వారికి దీటుగా ఎన్టీయే కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ..
కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ లోక్సభ స్థానం అభ్యర్థి స్మృతి ఇరానీని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఆమె అమేథీ..
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాల కోసం ఆ యా పార్టీ నేతలే కాదు... ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.
తిరుపతి,తాడిపత్రి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నత అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించి వివరాలను సాక్షాధారాలతో సీట్ అధికారులకు అందజేసినట్లు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) తెలిపారు. మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్లో పొందుపరిచామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.అధికార కాంగ్రెస్ నేతలు చేతి వాటంతో టెండర్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు.శనివారం వరంగల్లో పర్యటించారు. కేజీ టూ పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికలతో (Lok Sabha Election 2024) ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈరోజు(శనివారం) తెలంగాణ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది.
లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ గాలి వీచిందన్నారు. రియాలిటీనీ దాచాల్సిన అవసరం లేదని చెప్పారు.