Home » Lok Sabha Election 2024
2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాడు టీఆర్ఎస్(TRS) పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి(Konda Visveshwar Reddy) ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ‘కొండా’కు 4,35,077 ఓట్లు రాగా ప్రత్యర్థి పటోళ్ల కార్తీక్రెడ్డిపై 73,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో లోక్ సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తికావడంపై అగ్రరాజ్యం అమెరికా(America) స్పందించింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ప్రశంసించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు తెలిపింది.
దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి(Malkajigiri). ఎన్నికలు జరిగిన ప్రతీసారి మార్పు కోరుకుంటోంది. 2008లో డీలిమిటేషన్లో భాగంగా మల్కాజిగిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గంగా పురుడు పోసుకుంది.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై పతంగి మరోసారి ఎగిరింది. వరుసగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi).. ఔర్ ఏక్ బార్ అంటూ ఐదోసారి కూడా విజయఢంకా మోగించారు. మొత్తం 10,47,659 ఓట్లు పోలయ్యాయి.
నిఘా నీడలో, పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ(Parlament, Cantonment Assembly) ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నగరంలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజారిటీ 272 సీట్లుకాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లల్లో గెలుపొందింది. అయితే ఎన్డీఏ అభ్యర్థుల్లో చాలా మంది అత్తెసరు మెజారిటీతో ఓడిపోగా, మరి కొందరు భారీ మెజారిటీతో ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవి చూశారు.
గ్రేటర్ హైదరాబాద్లో కీలకంగా ఉన్న మైనార్టీలు హైదరాబాద్(Hyderabad) లోక్సభ స్థానం పరిధిలో వార్ వన్సైడ్ చేశారు. ఈ లోక్సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఉన్న మైనార్టీలు ఒకటి, రెండు శాతం మినహా పూర్తిగా మజ్లిస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.
సార్వత్రిక సమరం ముగిసింది అనుకుంటున్న వేళ మరో సమరం తెరపైకి వచ్చింది. అదే.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడం. ప్రధాని మోదీ చరిష్మా మరోసారి మ్యాజిక్ చేస్తుందనుకున్న బీజేపీ నేతలకు ఇది మింగుడుపడటం లేదు.
ఎన్నికల్లో 15 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో TMC అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఉన్నారు. బహరంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పఠాన్ విజయం సాధించారు.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్(Nitish Kumar) బుధవారం ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారని వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 40 సీట్లలో 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకున్న జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.