Home » Loans
రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో తీసుకుంటున్న అప్పుల సగటు కాల పరిమితి(టర్మ్) నానాటికీ పెరిగిపోతోంది. గతంలో సగటు కాల పరిమితి 10-12 ఏళ్లు ఉండగా.. ఇప్పుడది 19 ఏళ్లకు పెరిగింది.
మీరు హోమ్ లోన్(home loan) తీసుకున్నారా. ఈ క్రమంలో మీ EMI చౌకగా మారడానికి RBI రెపో రేటును తగ్గిస్తుందని ఆశించారా. అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (ఆగస్టు 8న) వరుసగా 9వ సారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. దీంతో గృహ రుణ ఈఎంఐ తగ్గుతుందని ఆశించిన వారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు.
రెండు లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు.. ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది.
అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు.
రుణాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తూర్పారబట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల కోసం తీసుకున్న పూచీకత్తు రుణాల వివరాలను గోప్యంగా ఉంచిందని ఆరోపించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కోసం తీసుకున్న రుణాల వివరాలనూ బహిర్గతపర్చలేదని దుయ్యబట్టింది.
ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారు? రైతుల వారీగా విడుదల చేసిన నిధులెన్ని? మొదటి, రెండో దశల్లో రుణమాఫీ పొందిన రైతుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు దశలవారీగా అంటూ మాట మార్చిందని, అది కూడా నామమాత్రంగానే అమలు చేస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం.. రూ. 6,191 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్(టీజీక్యాబ్)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) అంగీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని(Loan waiver) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలన్నీ ఒకే రోజులో మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన కాలయాపన వల్ల 8 నెలలుగా రైతు రుణాలపై పడిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని అన్నారు.