Home » Loans
తన వద్ద డబ్బులు లేకపోవడం వలన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ప్రధానమైన అంశంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) సైతం డబ్బులు లేకపోవడం వలనే తాను నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తా.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతా.. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా..! ఇవీ 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan) చెప్పిన మాటలు. ఐదేళ్ల వైసీపీ పాలన తర్వాత చూస్తే.. అప్పుల కుప్పలు.. అరాచకాలు.. గుంతల రోడ్లు, మహిళలపై పెరిగిన వేధింపులు, పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడు. ఎన్నికల వేళ ఏపీలో జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే.
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి..
Best Home Loans: గత ఏడాది కాలంగా దేశంలో రెపో రేటు(Repo Rate)లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 2023లో రెపో రేటును 0.25 శాతం పెంచారు. దీంతో రెపో రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గృహ రుణ(Home Loans) వడ్డీ రేట్లు కూడా పెద్దగా పెరగలేదు.
ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజల తమకంటూ ఓ ఇల్లు, సొంత వాహనం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే.. తమ వద్ద డబ్బుతో పాటు.. కొంత మొత్తంలో లోన్ తీసుకుని మరీ ఇళ్లు కట్టుకోవడం, సొంతంగా వాహనం కొనుగోలు చేయడం చేస్తున్నారు. మంచి శాలరీ వచ్చే వారికి లోన్ చాలా ఈజీగా లభిస్తుంది. అయితే, లోన్ పొందడం అందరికీ సులువు కాదనేది కూడా నిజం.
అతి తక్కువ వడ్డీ రేటుపై పర్సనల్ లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే!
ఆ తర్వాత ఓ యాప్ ద్వారా ఖాతాకు డబ్బులు వచ్చాయని తెలుసుకుని, ఆ ఖాతాలోకి తిరిగి జమ చేశాడు. డబ్బును వెంటనే తిరిగి చెల్లించినప్పటికీ...
ఒకప్పుడు కారు కొనడమంటే అది అత్యంత ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. అయితే మారుతున్న కాలానికి అనుకుగుణంగా ప్రస్తుతం సామాన్యులు కూడా కారు కొనే పరిస్థితికి వచ్చారు. చిన్న చిన్న వ్యాపారులు మొదలుకొని, మంచి మంచి జీతాలకు ఉద్యోగాలు చేసేవారంతా విధిగా..
ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అడ్డం పెట్టుకొని సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న నేరాలు అన్నీ ఇన్నీ కావు. ట్రెండింగ్లో ఉన్న అంశాల్ని సైతం తమకు అనుకూలంగా మార్చుకొని, ప్రజల్ని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకొస్తున్న స్కీమ్లను సైతం వీళ్లు విడిచిపెట్టడం లేదు. ఇలాంటి...
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే పలు కీలక హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) .. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ రైతులకు తీపి కబురు చెప్పారు. రైతులకు రూ.లక్ష లోపు (రూ.99,999) వరకు రుణమాఫీని పూర్తి చేసింది కేసీఆర్ సర్కార్. దీంతో రాష్ట్ర రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. సోమవారం ఒక్కరోజే.. 10,79,721 మంది రైతులకు రూ. 6,546.05 కోట్ల రుణమాఫీ చేసింది...