Home » Liquor rates
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపుల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్రంలో మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం రాత్రి 7.00 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులున్నాయి. ఈ షాపుల కోసం గురువారం అర్థరాత్రి వరకు 65,424 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.
మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుల ద్వారా కనీసం రూ.వెయ్యి కోట్లయినా వస్తాయా... అనే ఆందోళనలు, అనుమానాలు పటాపంచలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 89,643 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున... 1792.86 కోట్ల ఆదాయం సమకూరింది.
మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం రెండు లక్షల దరఖాస్తులు.. ఫీజు కింద రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు భావించారు. అయితే, కొన్నిచోట్ల సిండికేట్లు ప్రభావం చూపించడంతో అంచనా కంటే కొంత తగ్గువగా దరఖాస్తులు వచ్చాయి.
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 113 మద్యం షాపుల కోసం 4,839 దరఖాస్తుల దాఖలు చేశారు. ఇక అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో మొత్తం 40 మద్యం దుకాణాలున్నాయి. వాటికి కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరోవైపు నేటి రాత్రి వరకు గడువు ముగియనుంది. దీంతో ఈరోజు మరో 20 వేల దరఖాస్తులు దాఖలవుతాయని అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో అదనపు పన్నులు విధించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. మద్యం సీసాల ధరల్లో రౌండాఫ్ విధానంపై స్పష్టతనిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం పాలసీ అమలులోకి రాకముందే దరఖాస్తు రుసుము రూపేణా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 3,396 షాపులకు గురువారం సాయంత్రానికి 65,629 దరఖాస్తులు వచ్చాయి.
‘ఐదారు రోజుల్లో ప్రైవేటు షాపులు వచ్చేస్తున్నాయి. మన ఉద్యోగాలు ఊడిపోతాయి. దొరికినకాడికి దోచేయడమే ఇప్పుడు మన పని’.. అని అనుకుంటున్నారు ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నట్లు తెలియవచ్చింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల కోసం జారీచేసిన లాటరీ వ్యవహారం కాక రేపుతోంది. లాటరీ విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలు రాసింది. ఆ విషయం అధికారుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు.