Home » Liquor rates
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన లిక్కర్ డబ్బులు సాయంత్రానికి డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేవని, అటువంటి వ్యవస్థను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి కూటమి ప్రభుత్వం మద్యం షాపులు కట్టబెట్టిందని..
తెలంగాణ సర్కార్ మద్యం ధరల పెంపునకు సిద్ధమైనట్లు సమాచారం. సాధారణంగా బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి పెంచుతుంది. అలాగే ఈసారి వివిధ రకాల మద్యంపై రూ. 20 నుంచి రూ. 150 పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరాయి.
లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న లైసెన్సీలకు బెదిరింపులు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో తమవారికి షాపులు రాకపోవడంతో ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగారు. వ్యాపారంలో కచ్చితంగా వాటా కావాలని లేదంటే వ్యాపా రం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
దసరా పండగ వేళ తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. సీజన్లో 20 నుంచి 25 శాతం ఎక్కువగా లిక్కర్ సేల్స్ జరిగాయి. గత మూడు రోజుల నుంచి మద్యం విక్రయాలు పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపుల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్రంలో మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం రాత్రి 7.00 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులున్నాయి. ఈ షాపుల కోసం గురువారం అర్థరాత్రి వరకు 65,424 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.
మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుల ద్వారా కనీసం రూ.వెయ్యి కోట్లయినా వస్తాయా... అనే ఆందోళనలు, అనుమానాలు పటాపంచలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 89,643 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున... 1792.86 కోట్ల ఆదాయం సమకూరింది.
మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం రెండు లక్షల దరఖాస్తులు.. ఫీజు కింద రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు భావించారు. అయితే, కొన్నిచోట్ల సిండికేట్లు ప్రభావం చూపించడంతో అంచనా కంటే కొంత తగ్గువగా దరఖాస్తులు వచ్చాయి.
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 113 మద్యం షాపుల కోసం 4,839 దరఖాస్తుల దాఖలు చేశారు. ఇక అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో మొత్తం 40 మద్యం దుకాణాలున్నాయి. వాటికి కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరోవైపు నేటి రాత్రి వరకు గడువు ముగియనుంది. దీంతో ఈరోజు మరో 20 వేల దరఖాస్తులు దాఖలవుతాయని అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో అదనపు పన్నులు విధించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. మద్యం సీసాల ధరల్లో రౌండాఫ్ విధానంపై స్పష్టతనిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.