Home » Leopard
వనస్థలిపురం( Vanasthalipuram)లో చిరుతపులి(Leopard) కదలికలు కనిపించడంతో స్థానికంగా అలజడి నెలకొంది.చిరుత కదలికలతో స్థానికులు భయాభ్రాంతులకు గురవుతున్నారు.
తిరుమల నడకదారిలో చిరుతలను పట్టుకునేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు పీసీఎఫ్ నాగేశ్వర రావు తెలిపారు.
నిత్యం రద్దీగా ఉండే అలిపిరి నడకదారిలో వన్యప్రాణుల సంచారం ఎందుకు ఎక్కువగా మారిందని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు బహిర్గతం అవుతున్నాయి. సైన్స్ ప్రకారం సాధారణంగా మనుషులు ఎక్కువగా తిరిగే మార్గంలో వన్యప్రాణులు తిరగవు అని.. వాటి ఆశ్రయానికి, తినే ఆహారానికి ఎవరైనా భంగం కలిగిస్తే తప్ప అవి మనుషులు తిరిగే మార్గంలోకి రావని విశ్లేషకులు వివరిస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
తిరుమలలో మరికొద్దిరోజుల పాటు ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని సీసీఎఫ్ నాగేశ్వరరావు తెలిపారు.
తిరుమలలో మరో చిరుత బోనుకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయమై వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ సతీష్ మీడియాతో మాట్లాడుతూ.. నరశింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కిందన్నారు. ఆలయానికి సమీప ప్రాంతంలోని ఐదు వందల మీటర్ల రేడియేషన్లో రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో చిరుతపులి(Leopard) సంచరించింది. చిరుత కదలికలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత పులి(Leopard) కలకలం సృష్టించింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు(Srisailam Outer Ring Road)లో చిరుత సంచరించింది.
తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికను చంపేసిన రెండు రోజుల్లోనే ఆ చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు. తిరుమల కాలిబాట మార్గానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దదిగా అటవీ అధికారులు గుర్తించారు.
తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.