Home » Lawyer
దేశ నేర న్యాయవ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని విద్యుత్ కమిషన్ తీవ్ర వివక్ష చూపుతోందని మాజీ సీఎం కేసీఆర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైౖర్మన్గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ దుర్గాప్రసాదరావు నియమితులయ్యారు.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్(ఏజీ)గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్కు నోట్ ఫైల్ వెళ్లింది.
రైతులను నట్టేట ముంచేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్గమైందని, దానిని ముఖ్య మంత్రి చంద్రబాబు రద్దుచేయడం ఎంతో అభినం దనీయమని న్యాయవాదులు పేర్కొన్నారు. దాన్ని ర ద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టువద్ద న్యాయవాదులు మిఠా యిలు పంచుకు న్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యా లీ నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయడంతో పట్టణంలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం కోర్టు ఆవరణలో వారు కేక్ కట్చేసి స్వీట్లు పంచిపెట్టారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు
న్యాయవాదులు..వినియోగదారుల పరిరక్షణ చట్టం-1986 పరిధిలోకి రారని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గట్టు వామనరావు దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వామనరావు కొడుకు గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా సీఐడీతో లేదా సీబీఐతో అయినా తిరిగి విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని..
తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజీల్లో న్యాయ విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష గడువును పొడగించారు. తొలుత ప్రకటించిన గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల వినతి మేరకు మరో 10 రోజులు అవకాశం ఇచ్చారు.