Home » Landslides
తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల హరిణీ శ్రీ వయనాడ్ ప్రజలకు నేను సైతం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో నిధులు సమకూర్చేందుకు మూడు గంటల పాటు ఏకధాటిగా భరతనాట్యం చేసింది. ఈ సందర్భంగా వచ్చిన నగదుతోపాటు తాను గతంలో దాచుకున్న సొమ్మును కేరళ చీఫ్ మినిస్టర్ డిస్ట్రేస్ రిలీఫ్ ఫండ్కు అందించింది. ఈ సందర్బంగా చిన్నారి హరిణీ శ్రీని కేరళ సీఎం పినరయి రవి అభినందించి, ఆశీర్వదించారు.
‘ కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే ’.. అని ఓ కవి చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఏ బిడ్డ అయినా ఆకలితో ఉన్నా.. ఏడ్చినా అమ్మ చూస్తూ ఊరుకోదు.. ఏదో ఒకటి చేసేంత వరకూ అమ్మ మనసు ఊరుకోదు అంతే..! ఇలాంటి సన్నివేశమే కేరళలో కనిపించింది.. ఒకే ఒక్క సందేశంతో కోట్లాది మనసులను గెలుచుకుంది ఆ అమ్మ..! అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ..!
వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తారు. చికిత్స ఒకటే కాదు వైద్య రంగంలో అణువణువునా వారి ప్రమేయం ఉంటుంది. మృతదేహాలను చూస్తేనే మనం వణికిపోతాం. అలాంటిది నుజ్జైన శరీరాలకు పోస్టుమార్టం చేయడంలో కూడా వైద్యులు కీలకంగా ఉంటారు.
కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వయనాడ్(Wayanad) దుర్ఘటన ప్రాంతాలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) గురువారం సందర్శించారు.
దశాబ్ద కాలంలో భారత్లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో కేరళలోని వయనాడ్(Wayanad Landslides) దుర్ఘటన చరిత్రలో నిలిచిపోతుంది. జులై 30 తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్మల్లోని వందల సంఖ్యల్లో ఇళ్లు మట్టిదిబ్బల్లో కూరుకుపోయాయి.
కొండచరియలు విరిగిపడటంతో కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి భరోసానివ్వడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆగస్టు 1న వయనాడ్లో పర్యటించారు.
కేరళలోని వయనాడ్లో సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం అందరికీ తెలిసిందే. బుధవారం కొండచరియలు విరిగిపడటంతో.. 167 మంది మృతి చెందారు. ఇంకా వందల..
కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 270కిపైగా మృతదేహాలను బయటకి తీయగా మరో 200లకు పైగా మృతదేహాలు బురదలో చిక్కుకుపోయాయి.
సమాజంలో జరుగుతున్న నేరాలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం ఉందా అనే భావన కలగక మానదు. అలాంటప్పుడే మానవత్వం పరిమళించే ఘటనలు సాక్షాత్కరిస్తుంటాయి. కేరళ విషయంలో అచ్చం ఇలాంటిదే జరుగుతోంది.
భారీ వర్షాలు, వరదలతో(Kerala Landslides) అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రం వయనాడ్కు భారత వాతావరణ శాఖ ముందుగానే రెడ్ అలర్ట్ జారీ చేసిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు.