Home » Kuwait
45 మంది భారతీయుల భౌతికకాయాలతో భారత వైమానిక దళం (IAF) ప్రత్యేక విమానం కువైట్ నుంచి బయలుదేరింది. ఈ విమానం మొదట కేరళలోని కొచ్చి(Kochi) చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా ఉన్నారు.
కువైట్లోని మంగ్ఫలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు దుర్మరణంపాలయ్యారు. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు అగ్నికీలలు, దట్టమైన పొగను తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా..
ప్లస్ టు లో కూతురికి మంచి మార్కులు వచ్చాయి. ఇంటికి వచ్చి నర్సింగ్ కోర్సులో చేర్పించాలని అనుకున్నాడు. పై చదువు చదివే బిడ్డకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. వచ్చే నెలలో కేరళ రావాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో విధి వక్రీకరించింది. ఆ ఇంటి పెద్దను బలి తీసుకుంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో(Kuwait Fire Accident) భారతీయుల మృతదేహాలు గుర్తుపట్ట రానంతగా కాలిపోయాయని కేంద్ర మంత్రి కీర్తీ వర్ధన్ సింగ్(Kirthivardhan Singh) గురువారం తెలిపారు. బాధితులను గుర్తించేందుకు డీఎన్ఎ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు.
కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో(Kuwait Fire Accident) 50 మందికి పైగా భారతీయులు మృతి, 40 మందికి పైగా గాయపడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అర్ధరాత్రి సమీక్ష నిర్వహించారు.
పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి.. భవిష్యత్కు బంగారు బాటలు వేసుకునేందుకు రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ఆ కార్మికుల ఊపిరి ఆగిపోయింది. కాయకష్టం చేసి, ఆదమరిచి
కువైట్ లో సంభవించిన భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణ చర్యలకు దిగారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెంటనే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ను ఆదేశించారు.
దక్షిణ కువైట్ లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారు జామున 6 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో 41 మంది సజీవదహనమయ్యారు.
తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దత్తుగా కువైట్లో ఎన్నారైలు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు.
ఎన్నారై తెలుగుదేశం కువైట్, జనసేన కువైట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు.