• Home » Kutami

Kutami

CM Chandrababu: ఈ కాన్ఫరెన్స్ చరిత్రాత్మకమైనది..

CM Chandrababu: ఈ కాన్ఫరెన్స్ చరిత్రాత్మకమైనది..

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇవాళ జరుగుతున్న కాన్పరెన్స్ చరిత్రాత్మకమైన కాన్ఫరెన్స్ అని, చరిత్ర తిరగరాయబోతోందని అన్నారు.

CM Chandrababu: ఏపీ విజన్ డాక్యుమెంట్ అక్టోబర్ 2న విడుదల..

CM Chandrababu: ఏపీ విజన్ డాక్యుమెంట్ అక్టోబర్ 2న విడుదల..

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏపీ విజన్ డాక్యుమెంట్‌ను అక్టోబర్ 2న విడుదల చేస్తామని, కలెక్టర్‌లు ఆఫీసులో మాత్రమే కాకుండా ఫీల్డ్ విజిట్ కూడా చేయాలని సూచించారు. క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలన్నారు.

Chandrababu: వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్న  సీఎం చంద్రబాబు

Chandrababu: వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

శ్రీ సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం, గుండుమలలో సీఎం పర్యటించనున్నారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష జరిగింది.

AP News: ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే..

AP News: ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

AP Politics: మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ..

AP Politics: మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లోని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఛాంబర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆయనకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం మెుదటగా ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌తో సహా బీజేపీ ఎమ్మెల్యేలు లోకేశ్ ఛాంబర్‌కి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు.

Minister Nimmala: ఆ పథకంపై అప్పుడే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం..

Minister Nimmala: ఆ పథకంపై అప్పుడే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం..

అమ్మకు వందనం (Ammaku vandanam) పథకంపై వైసీపీ, నీలి మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్‌(Press Council)కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నిమ్మల చెప్పుకొచ్చారు.

MP C.M.Ramesh: నెహ్రూ తర్వాత ప్రధాని మోడీదే ఆ రికార్డు: ఎంపీ సీఎం రమేశ్

MP C.M.Ramesh: నెహ్రూ తర్వాత ప్రధాని మోడీదే ఆ రికార్డు: ఎంపీ సీఎం రమేశ్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు ఐకమత్యంతో తమను గెలిపించినందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(MP C.M.Ramesh) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీర్చిదిద్దారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ హయాంలో ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

AP News: తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత..

AP News: తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత..

తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేసారు. అయితే వైసీపీ అల్లరి మూకలే బ్యానర్లను చించి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యానర్లు చించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

AP News: పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

AP News: పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.

AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు

AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు

అధికారం కోల్పోయిన అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడికి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ లేఖ రాయడంపై బుధవారం అమరావతిలో ఆయన స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి