Home » Kuppam
కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి రెండో రోజు శుక్రవారం పర్యటన కొనసాగుతోంది. ఆమె బస చేసిన పిఎస్ మెడికల్ కాలేజీ ఆవరణంలో ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భువనేశ్వరి అన్నారు.
Telangana: ‘‘కాలేజ్ డేస్ గుర్తుకు వస్తున్నాయి. ఆషామాషీగా వెళ్లి మీరందరూ చేసేదే నేను కూడా కాలేజ్లో చేసేదాన్ని. మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ లీడర్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీ హక్కుకోసం నడవాలి’’ అని నారా భువనేశ్వరి అన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవి అనుభవించిన ఎమ్మెల్సీ భరత్.. ప్రభుత్వం మారగానే అడ్రస్ లేకుండా పోయారంటూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ పదవి అనుభవించిన భరత్.. ప్రస్తుతం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం..
Andhrapradesh: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. మరికొందరు పార్టీ నుంచి జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటు కుప్పంలోనే వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు.. టీడీపీ కండువా కప్పుకున్నారు.
Nara Bhuvaneswari: కంచిబందార్లపల్లిని దత్తత తీసుకున్న నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు.
Andhrapradesh: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైసీపీ అధికార ప్రతనిధి నోటికొచ్చినట్లు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు రాజీనామా చేసి జంప్ చేయగా.. తాజాగా ఓ బిగ్ షాట్ టీడీపీలో చేరబోతున్నారు..!
చిత్తూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో బుధవారం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన బస చేసిన కుప్పం ఆర్అండ్బి అతిథి గృహము వద్ద ఉదయం 10.30 గంటలకు ప్రజల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది.
‘నాకు మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో చంద్రబాబు ఉండనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్నారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గానికి రావడంతో.. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి.