• Home » Konda Surekha

Konda Surekha

TS News: ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారంపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

TS News: ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారంపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిన నాటి నుంచి ఈ ప్రచారం జరుగుతోంది.

Konda Surekha: తెలంగాణ ఖ్యాతిని చాటేలా బోనాలు..

Konda Surekha: తెలంగాణ ఖ్యాతిని చాటేలా బోనాలు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న దశాబ్ది ఆషాఢ మాస బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రతిపాదించిన పనులను వివిధ శాఖల సమన్వయంతో జూలై 5లోగా పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

Medak: మంత్రులకు రేవంత్‌ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు..

Medak: మంత్రులకు రేవంత్‌ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు..

గత కేసీఆర్‌ హయాంలోని మంత్రులకు ఏ మాత్రం స్వేచ్ఛ లేకపోయిందని, ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న పెద్దాయన అనుమతిస్తే తప్ప సంతకం పెట్టే అవకాశం ఉండేది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Hyderabad: అటవీ సిబ్బందిపై దాడులను సహించం..

Hyderabad: అటవీ సిబ్బందిపై దాడులను సహించం..

పోడు రైతులకు ఇబ్బందులు కలిగించబోమని, అదే సమయంలో అటవీ అధికారులపై దాడులు చేస్తే సహించబోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు సాగుదారుల హక్కులను కాపాడడంతోపాటు అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

TG: 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం..

TG: 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం..

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్‌ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.

Hyderabad: ఆలయ భూములకు జియో ట్యాగ్‌!

Hyderabad: ఆలయ భూములకు జియో ట్యాగ్‌!

రాష్ట్రంలో ఆలయ భూములు అన్యక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే ఆలయ భూముల్ని ఆధునిక పద్దతిలో రికార్డు చేసేందుకు సిద్ధమైంది. సర్వే జరిపి వాటిని జియో ట్యాగ్‌తో పరిరక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఆలయ భూముల జియో ట్యాగింగ్‌, ఫెన్సింగ్‌,

Loksabha polls: సిద్ధిపేటలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండా సురేఖ ఇంటింటి ప్రచారం

Loksabha polls: సిద్ధిపేటలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండా సురేఖ ఇంటింటి ప్రచారం

Telangana: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి అయ్యారు అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.

Konda Surekha: కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

Konda Surekha: కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ సిటీలోని మినిస్టర్ కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు, పాత కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.

Loksabha Polls 2024: ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఆర్.. కొండా సురేఖ విమర్శ

Loksabha Polls 2024: ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఆర్.. కొండా సురేఖ విమర్శ

Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అనేది రాజశేఖర్ రెడ్డి అయితే.. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఅర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

Konda Surekha: కేసీఆర్‌ను అందుకే ఇంటికి పంపారు

Konda Surekha: కేసీఆర్‌ను అందుకే ఇంటికి పంపారు

తెలంగాణ రాష్ట్రాన్నే కాదు.. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ను సైతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభివద్ధి చేయలేదని.. అందుకే ఆయన్ని ప్రజలు ఇంటికి పంపించారని మంత్రి కొండా సురేఖ వ్యంగ్యంగా అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దౌలాపూర్ గ్రామంలో శిలా ప్రతిష్టా మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి కొండా సురేఖతోపాటు నీలం మధు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి