Home » Konda Surekha
నోటికొచ్చినట్టు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదని, కేటీఆర్ అహంకారపు మాటలను తెలంగాణ మహిళా సమాజం మర్చిపోదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో తోపులాట ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని ఆమె అన్నారు.
బల్కంపేట ఎల్లమ్మతల్లి(Balkampet Yellamma) కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కల్యాణాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ పెద్దఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామీఅమ్మవార్లను అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister konda surekha) దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆలయానికి చేరుకున్నారు.
ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నెలరోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, ఊరేగింపులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిన నాటి నుంచి ఈ ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న దశాబ్ది ఆషాఢ మాస బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రతిపాదించిన పనులను వివిధ శాఖల సమన్వయంతో జూలై 5లోగా పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
గత కేసీఆర్ హయాంలోని మంత్రులకు ఏ మాత్రం స్వేచ్ఛ లేకపోయిందని, ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న పెద్దాయన అనుమతిస్తే తప్ప సంతకం పెట్టే అవకాశం ఉండేది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు.
పోడు రైతులకు ఇబ్బందులు కలిగించబోమని, అదే సమయంలో అటవీ అధికారులపై దాడులు చేస్తే సహించబోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు సాగుదారుల హక్కులను కాపాడడంతోపాటు అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.