Home » Konda Surekha
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు.
సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను(Konda Surekha) కించపరుస్తూ ట్రోల్ చేయడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు ట్రోలింగ్ను ఖండిస్తున్నట్లు చెప్పారు.
అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖకు కండువా కప్పానని, దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలను కంట్రోల్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.
జిల్లా ఇన్చార్జి మంత్రిగా తాను మెదక్ వెళ్లినప్పుడు.. చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ.. బీజేపీ ఎంపీ రఘునందన్రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే..
Telangana: రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా పథకం కోసం ప్రతీఒక్క రైతు ఎదురుచూస్తున్న నేపథ్యంలో మంత్రి ఇచ్చిన ప్రకటన ఊరటనిస్తుందనే చెప్పొచ్చు.
దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, సహజవనరులైన అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నోటికొచ్చినట్టు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదని, కేటీఆర్ అహంకారపు మాటలను తెలంగాణ మహిళా సమాజం మర్చిపోదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో తోపులాట ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని ఆమె అన్నారు.
బల్కంపేట ఎల్లమ్మతల్లి(Balkampet Yellamma) కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కల్యాణాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ పెద్దఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామీఅమ్మవార్లను అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister konda surekha) దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆలయానికి చేరుకున్నారు.
ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.