Home » Konda Surekha
రాజకీయ కక్షసాధింపులో భాగంగా.. సమాజంలో తనకున్న పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ తన గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన పరువు, ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మాట్లాడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాంపల్లి కోర్టుకు తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి ప్రత్యేక కోర్టును ఈ సందర్బంగా కేటీఆర్ అభ్యర్థించారు. ఈ సందర్బంగా కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది.
నాంపల్లి కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిగింది. అందులోభాగంగా కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆమె ఇలాంటి వాఖ్యలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సమాజంలో తనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని.. అయితే వాటిని దిగజార్చాలానే ఆమె ఈ తరహా వాఖ్యలు చేసిందని కోర్టుకు కేటీఆర్ విన్నవించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.. మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ కేటీఆర్ స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. గత విచారణ సందర్భంగా కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
అన్నదాతను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి పగ బట్టినట్లుగా అకాల వర్షాలతో పంటలపై ప్రభావం చూపగా, చేతికొచ్చిన పంటకు తేమ శాతం పెరుగుతుండటంతో మద్దతు ధర లభించే పరిస్థితి కనిపించట్లేదు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుకు రాకుండా డుమ్మా కొట్టారు.
రాష్ట్రంలో ఆధ్మాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆలయంలో 14చోట్ల మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 47 చోట్ల టాయిలెట్స్ నిర్మించినట్లు చెప్పారు. విష్ణు పుష్కరిణీ గుండాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో తాము నిర్వహించాల్సిన పనుల్లోనూ మంత్రి కొండా సురేఖ జోక్యం పెరిగిపోయిందంటూ టీపీసీసీ చీఫ్ మహే్షకుమార్ గౌడ్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఫిర్యాదు చేశారు.
మంత్రి కొండా సురేఖ ఫొటోను మార్ఫింగ్ కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.