• Home » KonaSeema

KonaSeema

ఆరు సర్కిళ్లు..150 మద్యం షాపులు

ఆరు సర్కిళ్లు..150 మద్యం షాపులు

జిల్లాలో ఆరు ఎక్సైజ్‌ సర్కిల్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో 150 మద్యం షాపులు ఏర్పాటుకు గుర్తించినట్టు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి అమర్‌బాబు తెలిపారు. 2024-26 నూతన ఎక్సైజ్‌ పాలసీ అమలుకు అబ్కారీ శాఖ సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు, డీఎస్పీలతో నూతన మద్యం పాలసీ అమలుపై ముందస్తు సమావేశం నిర్వహించారు.

 ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. సోమవారం నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రులైన ఓటర్ల నమోదు ప్రక్రియ ఆరంభమైంది.

టెంపుల్‌, ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు

టెంపుల్‌, ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు

జిల్లాలో టెంపుల్‌ టూరిజంతో పాటు ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

వసతి గృహాల విద్యార్థులకు గోల్డెన్‌ అవర్‌ బీమా

వసతి గృహాల విద్యార్థులకు గోల్డెన్‌ అవర్‌ బీమా

జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా వసతి గృహాల విద్యార్థులందరికీ గోల్డెన్‌ అవర్‌ బీమా సదుపాయం కల్పించనున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. ఐసీఐసీఐ లాంబార్డ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథాశ్రమాలు, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులందరికీ ఈ బీమా సదుపాయం వర్తింపచేస్తామన్నారు.

గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించాలి

గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించాలి

జిల్లాలోని గ్యాస్‌ పైపులైను లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే అరికట్టే దిశగా చమురు సంస్థలు, జిల్లా అగ్నిమాపక శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

గోవింద శంఖారావం

గోవింద శంఖారావం

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని కల్తీచేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్న ప్రధాన డిమాండ్‌తో గోవింద శంఖారావం పేరిట హిందూ సంఘాలు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అమలాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిపాలవీధిలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి వందలాది మంది నిరసన ర్యాలీగా బయలుదేరారు.

ఆక్వా చెరువుల అఫిడవిట్‌ను ఎన్జీటీకి సమర్పించాలి

ఆక్వా చెరువుల అఫిడవిట్‌ను ఎన్జీటీకి సమర్పించాలి

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) సర్వే నంబర్ల వారీగా స్టే ఆర్డరు జారీ చేసిన అక్రమ ఆక్వా చెరువులకు సంబంధించిన అఫిడవిట్‌ను జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్జీటీకి సమర్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు.

స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలి

స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలి

వ్యవసాయ ఆధారిత అనుబంధ స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఆధ్యర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది.

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద అమలాపురం రూరల్‌ బండారులంక జడ్పీ హైస్కూలులో భోజన పథక ఏర్పాట్లను కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు.

ఉచిత ఇసుక విధానంపై అవగాహన పెంచుకోవాలి

ఉచిత ఇసుక విధానంపై అవగాహన పెంచుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై అధికారులు పూర్తిగా అవగాహన పెంపొందించుకుని సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. ఇసుక నిర్వహణ వ్యవస్థ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వినియోగంపై శనివారం తహసీల్దార్లు, రవాణా ఏజెన్సీలు, మున్సిపల్‌ కమిషనర్లు వివిధ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి