• Home » KonaSeema

KonaSeema

 బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాదాలను నివారించాలి

బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాదాలను నివారించాలి

జిల్లాలో రహదారి ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాలపై అనుబంధ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నివారణా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌ స్పాట్‌ జంక్షన్లను గుర్తించి ఇంజనీర్ల సహకారంతో నివారణా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ కేంద్రాలు

మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ కేంద్రాలు

కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ కేంద్రాలను ప్రవేశ పెట్టిందని జేసీ టి.నిషాంతి తెలిపారు. అమలాపురం హౌసింగ్‌బోర్డు కాలనీలో మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిశుగృహ, వన్‌స్టాప్‌ సెంటర్లను ఏర్పాటుచేయగా సోమవారం జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హింసకు గురైన మహిళలు, ప్రైవేటు, బహిరంగ ప్రదేశాల్లో, కుటుంబంలో, కార్యాలయాల్లో మహిళలకు రక్షణగా నిలిచేందుకు వన్‌స్టాప్‌ కేంద్రాలు దోహద పడతాయన్నారు. శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతుగా నిలిచి ఈ కేంద్రాల ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తారన్నారు.

టిడ్కో జాబితా మార్చిందెవరు?

టిడ్కో జాబితా మార్చిందెవరు?

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాలను అర్హులైన పట్టణ పేదలకు ఇచ్చామని ఎమ్మెల్యే, కమిషనర్‌, మున్సిపల్‌ చైర్మన్లు సంతకాలు పెట్టి జాబితా విడుదల చేశారని అటువంటి అర్హుల పేర్లు ఎలా మార్పు చేస్తారని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రశ్నించారు. సొమ్ములు చెల్లించిన వారిని ఎలా మార్పు చేస్తారని అన్నారు. లబ్ధిదారుల పేర్లు మార్చింది ఎవరో తెలియాలని, అవసరమైతే వారిపై లీగల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

జగన్‌ హయాంలో జరిగిన హత్యకేసులపై పునర్విచారణ జరగాలి

జగన్‌ హయాంలో జరిగిన హత్యకేసులపై పునర్విచారణ జరగాలి

ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. సినీ నటి జెత్వానీ కేసుల మాదిరిగానే గత జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన సంచలన హత్యలు, కేసులు పునర్విచారణ చేపట్టాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) రాష్ట్రసమితి సమన్వయకర్త డాక్టర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు.

 దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. జిల్లాలో 370 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు నవంబరు 6 నుంచి ప్రారంభిస్తామన్నారు. 2024-25 ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యానికి నాణ్యతా ప్రమాణాలకు లోబడి మద్దతు ధర కల్పిస్తామన్నారు. గతంలో ఉన్న ర్యాండమైజేషన్‌ ప్రస్తుతం లేదని, రైతులు తమకు నచ్చిన రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించుకుని విక్రయించుకునే వెసులుబాటు కల్పించారన్నారు.

రైల్వేలైన్‌ అభ్యంతరాలను పరిష్కరించాలి

రైల్వేలైన్‌ అభ్యంతరాలను పరిష్కరించాలి

జాతీయ రహదారి-216, కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ పెండింగ్‌ కేసులు, అభ్యంతరాలను సత్వరం పరిష్కరించి పనుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం భూసేకరణ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. కోర్టు కేసులు, నిర్వాసితులు కోల్పోతున్న భూములు, కట్టడాలపై వచ్చిన అభ్యంతరాల పరిస్థితుల స్థితిగతులపై కలెక్టర్‌ ఆరా తీశారు. గడువులోగా సమస్యలు పరిష్కరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

 ఓఎన్జీసీ సైట్‌లో భారీగా శబ్దాలు

ఓఎన్జీసీ సైట్‌లో భారీగా శబ్దాలు

చల్లపల్లి ఓఎన్జీసీ సైట్‌లో జీఎండీఏ-14 బావి నుంచి బుధవారం అర్ధరాత్రి బ్లోఅవుట్‌ను తలపించేలా భారీ శబ్దాలు వెలువడ్డాయి. అర్ధరాత్రి ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో బెస్తవారిపేట, గోపవరం మెయిన్‌, కోటమాయమ్మకాలనీ, జగ్గరాజుపేట, అయితాబత్తులవారిపేట పరిసర ప్రాంతాల జనం భయాందోళనకు గురయ్యారు. బ్లోఅవుట్‌ భయంతో పరుగులు తీఽశారు. విషయాన్ని కొందరు ఓఎన్జీసీ అధికారులకు తెలియజేశారు.

బాణసంచా విక్రయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు

బాణసంచా విక్రయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు

బాణసంచా విక్రయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని అమలాపురం ఆర్డీవో కె.మాధవి హెచ్చరించారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం దీపావళి పండుగ నేపథ్యంలో భద్రతా అంశాలపై రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక, కార్మికశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

 ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలి

ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలి

ధాన్యం కొనుగోలులో సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ధాన్యం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు సిబ్బందికి బుధవారం నిర్వహించిన సాంకేతిక శిక్షణా తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్‌ దీపాలంకరణ, సుంగధ పరిమళాలు వెదజల్లే వేద పండితుల మంత్రోచ్ఛరణ, కళాకారుల ప్రదర్శనలు, భక్తజన గోవిందనామస్మరణల నడుమ వాడపల్లి పులకించిం ది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి