• Home » KonaSeema

KonaSeema

Andhra Pradesh: ఖండాలుదాటిన ప్రేమ.. ఒక్కటి కాబోతున్న కోనసీమ అబ్బాయి,కెనడా అమ్మాయి

Andhra Pradesh: ఖండాలుదాటిన ప్రేమ.. ఒక్కటి కాబోతున్న కోనసీమ అబ్బాయి,కెనడా అమ్మాయి

Konaseema Man Marries Canada Woman: తెలుగు సాంప్రదాయ వివాహ బంధంతో కెనడా అమ్మాయి, కోనసీమ అబ్బాయి ఒకటి కాబోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కెనడా అమ్మాయితో అమలాపురం అబ్బాయి పెళ్లి చేసుకోనున్నారు.

 మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తీరుపట్ల అసంతృప్తి

మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తీరుపట్ల అసంతృప్తి

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌ పనితీరు పట్ల పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అధికార కూటమి శాసనసభ్యులు సైతం మంత్రి సుభాష్‌తో పెద్దగా సఖ్యత ప్రదర్శించకపోవడంతో ఆయన ఏకాకిగానే నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు.

 చేనేత సంఘాలకు ఎన్నికలు ఎప్పుడో?

చేనేత సంఘాలకు ఎన్నికలు ఎప్పుడో?

జిల్లాలో చేనేత సహకార సంఘాలకు డిసెంబరు 4న ఎన్నికలు జరుగుతాయని, అక్టోబరు 10న చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ జి.రేఖారాణి టెంటేటివ్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దాంతో పదకొండేళ్ల అనంతరం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయని చేనేత కళాకారులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కమిషనర్‌ ఆదేశాలతో జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు చేనేత సహకార సంఘాల కార్మికులను కలుసుకుని సమావేశాలు సైతం నిర్వహించారు.

నీటి సంఘాల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

నీటి సంఘాల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పునరుద్ధరించిన నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆయా శాఖల సిబ్బందిని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సాగునీటి సంఘాల ఎన్నికలపై అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.

 బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాదాలను నివారించాలి

బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాదాలను నివారించాలి

జిల్లాలో రహదారి ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాలపై అనుబంధ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నివారణా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌ స్పాట్‌ జంక్షన్లను గుర్తించి ఇంజనీర్ల సహకారంతో నివారణా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ కేంద్రాలు

మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ కేంద్రాలు

కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్‌ కేంద్రాలను ప్రవేశ పెట్టిందని జేసీ టి.నిషాంతి తెలిపారు. అమలాపురం హౌసింగ్‌బోర్డు కాలనీలో మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిశుగృహ, వన్‌స్టాప్‌ సెంటర్లను ఏర్పాటుచేయగా సోమవారం జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హింసకు గురైన మహిళలు, ప్రైవేటు, బహిరంగ ప్రదేశాల్లో, కుటుంబంలో, కార్యాలయాల్లో మహిళలకు రక్షణగా నిలిచేందుకు వన్‌స్టాప్‌ కేంద్రాలు దోహద పడతాయన్నారు. శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతుగా నిలిచి ఈ కేంద్రాల ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తారన్నారు.

టిడ్కో జాబితా మార్చిందెవరు?

టిడ్కో జాబితా మార్చిందెవరు?

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాలను అర్హులైన పట్టణ పేదలకు ఇచ్చామని ఎమ్మెల్యే, కమిషనర్‌, మున్సిపల్‌ చైర్మన్లు సంతకాలు పెట్టి జాబితా విడుదల చేశారని అటువంటి అర్హుల పేర్లు ఎలా మార్పు చేస్తారని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రశ్నించారు. సొమ్ములు చెల్లించిన వారిని ఎలా మార్పు చేస్తారని అన్నారు. లబ్ధిదారుల పేర్లు మార్చింది ఎవరో తెలియాలని, అవసరమైతే వారిపై లీగల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

జగన్‌ హయాంలో జరిగిన హత్యకేసులపై పునర్విచారణ జరగాలి

జగన్‌ హయాంలో జరిగిన హత్యకేసులపై పునర్విచారణ జరగాలి

ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. సినీ నటి జెత్వానీ కేసుల మాదిరిగానే గత జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన సంచలన హత్యలు, కేసులు పునర్విచారణ చేపట్టాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) రాష్ట్రసమితి సమన్వయకర్త డాక్టర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు.

 దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. జిల్లాలో 370 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు నవంబరు 6 నుంచి ప్రారంభిస్తామన్నారు. 2024-25 ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యానికి నాణ్యతా ప్రమాణాలకు లోబడి మద్దతు ధర కల్పిస్తామన్నారు. గతంలో ఉన్న ర్యాండమైజేషన్‌ ప్రస్తుతం లేదని, రైతులు తమకు నచ్చిన రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించుకుని విక్రయించుకునే వెసులుబాటు కల్పించారన్నారు.

రైల్వేలైన్‌ అభ్యంతరాలను పరిష్కరించాలి

రైల్వేలైన్‌ అభ్యంతరాలను పరిష్కరించాలి

జాతీయ రహదారి-216, కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ పెండింగ్‌ కేసులు, అభ్యంతరాలను సత్వరం పరిష్కరించి పనుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం భూసేకరణ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. కోర్టు కేసులు, నిర్వాసితులు కోల్పోతున్న భూములు, కట్టడాలపై వచ్చిన అభ్యంతరాల పరిస్థితుల స్థితిగతులపై కలెక్టర్‌ ఆరా తీశారు. గడువులోగా సమస్యలు పరిష్కరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి