• Home » KonaSeema

KonaSeema

కృష్ణా జిల్లా నుంచి ధాన్యం సేకరణ

కృష్ణా జిల్లా నుంచి ధాన్యం సేకరణ

కృష్ణాజిల్లాలో రైసు మిల్లులు తక్కువగా ఉండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి తుఫాన్‌ కారణంగా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ప్రాంత రైతులను కూడా ఆదుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.

 డిమాండ్‌కు అనుగుణంగా ఇసుక సరఫరా చేయాలి

డిమాండ్‌కు అనుగుణంగా ఇసుక సరఫరా చేయాలి

డిమాండ్‌కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఇసుక తవ్వకాలు నిర్వహించే కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం రావులపాలెం మండలం ఊబలంక ఆర్‌ఎస్‌ఆర్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఇసుక స్టాకు పాయింట్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్దేశించిన మేరకు ఇసుక తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 ఇసుక రీచ్‌ల ద్వారా 20 వేల మెట్రిక్‌ టన్నుల తవ్వకాలు జరగాలి

ఇసుక రీచ్‌ల ద్వారా 20 వేల మెట్రిక్‌ టన్నుల తవ్వకాలు జరగాలి

జిల్లాలో ఇసుక రీచ్‌ల ద్వారా రోజువారీ 20 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు జరపాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు.

 ఇక విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు

ఇక విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు

జిల్లాలో విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు అందుబాటులోకి వచ్చేశాయి. తొలి విడతలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో ఉన్న పాత విద్యుత్‌ మీటర్లను తొలగించి వాటి స్థానంలో స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా విద్యుత్‌ బిల్లులు రీడింగ్‌ తీసుకోవడానికి ఏజెన్సీలకు చెందిన సిబ్బంది వచ్చి ఐఆర్‌ మీటర్లు వద్ద తమ సెల్‌ఫోన్‌ ద్వారా రీడింగ్‌ను నమోదు చేసి వచ్చిన బిల్లులను ప్రింట్‌ తీసి ఇచ్చేవారు.

పిఠాపురంలో రైల్వే హాల్టు, ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి పవన్‌ వినతి

పిఠాపురంలో రైల్వే హాల్టు, ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి పవన్‌ వినతి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు పవన్‌కల్యాణ్‌ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్లు నిలుపుదల చేయాలని, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. పిఠాపురం మున్సిపాల్టీ పరిధిలో సామర్లకోట, ఉప్పాడ రోడ్డు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం అవసరం వివరిస్తూ ఆర్‌వోబీ మంజూరు చేయాలని కోరారు.

 భూచోళ్లు

భూచోళ్లు

గత వైసీపీ ప్రభుత్వ పాపాలతో జిల్లాలో భూవివాదాలు, కబ్జాలపై ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయి. న్యాయం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తోన్న బాధితుల సంఖ్యను పెంచుతున్నాయి. తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు, రీసర్వే పేరుతో భూములు లాగేసుకున్నారని మరికొందరు కూటమి ప్రభుత్వాన్ని భారీగా ఆశ్రయిస్తున్నారు.

 జిల్లాలో 2.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం

జిల్లాలో 2.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం

జిల్లాలో 2.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా నిర్దేశించామని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ప్రతిబంధకంగా మారిన రైస్‌మిల్లుల ర్యాండమైజేషన్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. రైతులు సమీపంలోని తమకు నచ్చిన మిల్లులకు ధాన్యం తరలించి విక్రయించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో సమస్యలను అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మిల్లర్లకు వివరించారు.

 మూడు నెలలకు ఒకేసారి

మూడు నెలలకు ఒకేసారి

గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్‌దారుడు ప్రతీ నెల పెన్షన్‌ తీసుకోవాల్సిందే. ఒక నెల అందుబాటులో లేకపోతే తర్వాత నెలలో ఆ పెన్షన్‌ వచ్చేది కాదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక నెల పెన్షన్‌ నగదు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని తర్వాత నెల పెన్షన్‌తో కలిపి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఒక్కో సందర్భంలో రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం నగదును అందజేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

డ్రోన్‌ టెక్నాలజీలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

డ్రోన్‌ టెక్నాలజీలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

వ్యవసాయ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం డ్రోన్‌ టెక్నాలజీపై శిక్షణ అందించే ఇండియన్‌ ఇన్‌స్టిస్టూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (కర్నూలు) సాంకేతిక ప్రతినిధులు కె.కృష్ణనాయక్‌, నరేష్‌బాబు, విష్ణుమూర్తి కలెక్టర్‌తో సమావేశమై సమీక్షించారు.

సదుపాయాల గుర్తింపునకు చెక్‌లిస్ట్‌

సదుపాయాల గుర్తింపునకు చెక్‌లిస్ట్‌

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను చెక్‌లిస్టు ఆధారంగా గుర్తించి వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సంబంధిత ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. 84 ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, చైల్డ్‌కేర్‌ సెంటర్‌లలో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం తదితర సమస్యలను గుర్తించేందుకు ఒక్కో వసతిగృహానికి ప్రత్యేక అధికారితో పాటు ఇంజనీర్‌ను నియమించామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి