Home » KonaSeema
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బహుళ ప్రయోజనకరంగా ఉన్నప్పుడే శక్తివంతంగా, ఆర్థిక లాభదాయకంగా రూపాంతరం చెందగలవని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం జేసీ అద్యక్షతన నిర్వహించారు.
15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలు అమలుచేసి సత్ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జిల్లాలను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతీ పథకం కార్యాచరణ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 13న స్వర్ణాంధ్ర-2047 డ్యాకుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించారని తెలిపారు.
విహారయాత్ర విషాదాంతమైంది. చిమ్మ చీకటి ఆపై ‘అలిసి’న ప్రయాణం శాపంగా మారి ఆయువు తీసింది.. చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగించే భార్యాభర్తలు, చక్కనైన ఇద్దరు కుమారులు..హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబ ప్రయాణం మంగళవారం తెల్లవారుజామున కుదుపులకు గురైంది. భార్య, ఇద్దరు పిల్లలను పోగొట్టుకుని ఓ వ్యక్తి ఒంటరిగా మిగిలాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడి శివారు చింతావారిపేటలో మంగళవారం తెల్లవారుజామున ప్రధాన పంట కాల్వలోకి కారు దూసుకుపోయిన సంఘటన ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.
ఆత్రేయపురం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం సినీనటుడు శుభలేఖ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్లోని గోదావరి భవన్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని 13 కేంద్రాల్లో ఆదివారం జాతీయ ఉపకార వేతన పరీక్షను నిర్వహించగా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2815 మందికి గాను 2688 మంది ఎన్ఎంఎంఎస్ పరీక్షకు హాజరయ్యారు.
ఆత్రేయపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పొటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మిహోమం, భాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి వివిధ
ప్రపంచం అంతా మారిపోయింది.. డిజిటల్ వైపు పరుగులు పెడుతోంది.. ప్రస్తుతం రూపాయి చెల్లించాలన్నా ఆన్లైన్.. అయితే పంచాయతీల్లో మాత్రం ఇప్పటి కింకా పాత పద్ధతే. ఏ సేవ కావాలన్నా మాన్యువల్గా దరఖాస్తు చేయాల్సిందే.. వాళ్లూ అదే స్థాయిలో మాన్యువల్గా ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనిలో భాగంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1103 పంచాయతీలు ఉండగా అన్నింటా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఏ సేవ అయినా ఆన్లైన్లోనే. దీంతో గ్రామీణ ప్రజల కష్టాలు తీరునున్నాయి.. ఈ సేవలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువా రం సాయంత్రం కరపలోని 115 నంబరు మద్యంషాపును సీజ్చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తాళ్లరేవు సీఐ కె.కోటేశ్వరరావు తెలిపారు. కరపమండలం పెనుగుదురులోని ఒక బెల్ట్షాపుపై గత నెల 22వ తేదీన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించి 126 మద్యం సీసాలు, 4 బీర్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్చేశారు.