Home » Komati Reddy Venkat Reddy
మామ చాటు అల్లుడిగా 10 వేల కోట్లు దోచుకున్నావ్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుపై రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మొక్కుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు శబరిమల వెళ్ళటానికి నల్ల దుస్తులు ధరించినట్లుందని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణన తరువాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, దాంతోరాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు పెరుగుతాయని ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
‘‘ ఎన్ఎస్యూఐ కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన నాయకులం మేము. కేటీఆర్తో మాకు పోలికా? కేసీఆర్ లేకుండా కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా?’’ అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్తులో ఒక వేళ కేటీఆర్ సీఎం అయినా.. తాము ఆయనకు విలువ ఇవ్వబోనని స్పష్టం చేశారు.
‘‘తెలంగాణ తల్లి విగ్రహంపై కొంత మంది మాట్లాడుతూ తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్ లేదు, ఒంటిపై పట్టు చీర లేదంటున్నారు. కానీ.. కిరీటం లేదన్న కారణంతో అమ్మను కాదంటామా’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏడాది కాంగ్రెస్ పాలనపై చార్జ్షీట్ వేసేంత నైతికత బీఆర్ఎస్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడగానే దళితుడినే సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి.. అవి చేయలేకపోయిన కేసీఆర్పై అప్పుడు ఎందుకు చార్జ్షీట్ వేయలేదని మండిపడ్డారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయితే ఆయన గౌరవం పెరుగుతుందన్నారు.
తెలంగాణలో ఇక నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘బెనిఫిట్ షో’లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన రాజీవ్ ప్రాంగణంలో లక్ష మందితో ముఖ్యమంత్రి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.