• Home » Kolusu Partha Sarathy

Kolusu Partha Sarathy

Kolusu Partha Sarathy: నూజివీడు ఘటనపై ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి పార్థసారథి..

Kolusu Partha Sarathy: నూజివీడు ఘటనపై ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి పార్థసారథి..

నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి హాజరుకావడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి కూటమి నేతలు ఆహ్వానించకుండానే జోగి వచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇప్పటికే వివరణ ఇచ్చారు.

Minister Parthasarathy: జోగి రమేష్ వివాదం.. మంత్రి  పార్థసారథి  క్షమాపణలు

Minister Parthasarathy: జోగి రమేష్ వివాదం.. మంత్రి పార్థసారథి క్షమాపణలు

ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్‌ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది.

Eluru: వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం..

Eluru: వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం..

నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా నిన్న పెద్దఎత్తున కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు.

AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం.. కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌  ఆమోదముద్ర

AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం.. కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర

ఏపీ టెక్స్‌టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి క్యాబినెట్‌లో ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీకి క్యాబినెట్‌లో ఆమోదించినట్లు చెప్పారు. మూడు తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల జీవో 62 ద్వారా ప్రైజ్ ఎడ్జెస్ట్ మెంట్ చేయబోతున్నామన్నారు. ఉద్దానం తాగునీటి వసతి, వైసీపీలో పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు పదిన్నర లక్షల మందికి తాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.

Atchannaidu: నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్

Atchannaidu: నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్

Andhrapradesh: ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు లేదన్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు.

Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మంత్రి కొలుసు పార్థసారథి  కీలక వ్యాఖ్యలు

Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు

బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం ఆలోచిస్తుంటే... వైసీపీమాత్రం జీవితకాలం అధ్యక్షుడిని తానేనని విస్తృత స్థాయి సమావేశంలో పెట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.

AP News: జగన్‌‌పై మంత్రి కొలుసు పార్ధసారధి  సంచలన వ్యాఖ్యలు

AP News: జగన్‌‌పై మంత్రి కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ పరువు తీసే పనులు జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లి, తల్లికే అన్యాయం చేశాడని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు.

AP News: కొన్ని పత్రికలకు అర్హత లేకపోయినా కోట్ల రూపాయలు యాడ్స్: మంత్రి కొలుసు

AP News: కొన్ని పత్రికలకు అర్హత లేకపోయినా కోట్ల రూపాయలు యాడ్స్: మంత్రి కొలుసు

గత ప్రభుత్వ హయంలో 200 రూపాయలు ఓ పత్రిక కొనుగోలు చేయాలని ఇచ్చారని.. దానిపై విచారణ జరుగుతోందని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. అది కూడా పలానా పత్రిక కొనాలని అనధికారికంగా నిర్ధేశించారనే సమాచారం ఉందన్నారు. అందుకే ముందుగా 200 రూపాయలు ఇచ్చే జీవోను రద్దు చేశామని వెల్లడించారు.

AP Govt: ఏపీలో  హైడ్రా తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

AP Govt: ఏపీలో హైడ్రా తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Minister Parthasarathy: జోగి రమేశ్ మాటలు అవివేకానికి నిదర్శనం: మంత్రి పార్థసారథి..

Minister Parthasarathy: జోగి రమేశ్ మాటలు అవివేకానికి నిదర్శనం: మంత్రి పార్థసారథి..

రాజకీయ కక్ష్యలతోనే తన కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే అతణ్ని అరెస్టు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి