Home » Kollu Ravindra
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన దిశగా స్థానిక శాసన సభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర అడుగులు వేస్తున్నారు.
కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.
కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.
అమరావతి: ఏపీ గనులు - భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ మూడో బ్లాక్లో ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో అత్యధికశాతం బీసీలే. గత వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని గొప్పుల చెప్పుకుంది.
నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్ట పరిధిలో శిక్షపడేలా చేస్తామన్నారు.
యువతను మత్తులో పెట్టి, గంజాయికి బానిసలుగా వైసీపీ నేతలు మార్చారని ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. తన మీద నమ్మకం ఉంచి రెండు కీలక శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పదవులు దక్కాయని రిలాక్స్ అవకుండా కార్యాచరణ చేపడుతున్నారు కొత్త మంత్రులు. మొన్నటికి మొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి అధికారులను హడలెత్తించారు. తాగునీటి సమస్యకు చెక్ పెట్టించారు. ఇక నేడు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ముందుగా రైతుల కోసం పంట కాల్వలు, తెనాలి ప్రజానీకం కోసం డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు
ఎన్నికైన వెంటనే అలసత్వం ప్రదర్శించక టీడీపీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగుతున్నారు. తమ నిజయోజకవర్గంలోని సమస్యలపై అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆకస్మిక పర్యటనలతో కొల్లు రవీంద్ర అధికారులను హడలెత్తిస్తున్నారు.