Home » Kolkata
ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిపై దాడి ఘటనకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అటు పోలీసులను ఇటు ఆసుపత్రి ఉన్నతాధికారులను శుక్రవారం కోల్కతా హైకోర్టు ఆదేశించింది. దాదాపు 7 వేల మంది గుంపుగా ఆసుపత్రిపై దాడికి తెగబడితే.. పోలీసుల నిఘా వైఫల్యాన్ని సూచిస్తుందని కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం అభిప్రాయపడ్డారు.
కోల్కతా(Kolkata)లోని ఆర్జి కర్ ఆస్పత్రిలో ట్రైనీ లేడీ డాక్టర్ హత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న ప్రధాని మోదీ(modi) ఎర్రకోట నుంచి ప్రసంగించిన క్రమంలో దేశవ్యాప్తంగా మన కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్న వారిలో భయాందోళనలు నెలకొనాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు.
జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కోల్కతా ఆర్జీ కర్ వైద్యకళాశాల ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి భయానక వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని దుండగులు ఆస్పత్రిలో పెను విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారుల ముసుగులో ఆ పరిసరాల్లోకి వచ్చిన గూండాలు ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లారు.
కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కేంద్ర భద్రత దళాలను మోహరించాలని ఢిల్లీలోని హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భ్లలాతోపాటు సీబీఐ డైరెక్టర్కు బీజేపీ నేత, ఎమ్మెల్యే సువేందో అధికారి విజ్ఞప్తిచేశారు.
ఆగస్ట్ 8వ తేదీ రాత్రి ఆసుపత్రిలో ఆ విద్యార్థి విధులకు హాజరయ్యే ముందు తన డైరీలో ఏం రాసుకుందో ఆమె కన్నతండ్రి గురువారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యులో వివరించారు. వైద్య వృత్తిలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను అంకితభావంతో సాధించాలని స్పష్టం చేసిందన్నారు.
కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్యకళాశాల ఆస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలి (31)పై అత్యాచారం, హత్య ఘటనకు దిగ్ర్భాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై సామూహిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రెయినీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారంనాడు తొలిసారి స్పందించారు. ఈ ఘటనతో వైద్య వృత్తిలో ఉన్నవారితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళల్లో అభద్రతా భావం పెరుగుతోందని అన్నారు.
ట్రైయినీ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని డాక్టర్ సుభర్ణ గోస్వామి వెల్లడించారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ సుభర్ణ గోస్వామి మాట్లాడారు. ఆమె శరీరంలో 151 గ్రాముల ద్రవ పదార్థం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడికి పాల్పడితే.. అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని తెలిపారు.
గువాహటి: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో అసోంలోని ఒక ఆసుపత్రి జారీ చేసిన అడ్వయిజరీ తీవ్ర విమర్శలకు గురైంది. దీంతో ఆ అడ్వయిజరీని యాజమాన్యం ఉపసంహరించుకుంది.
పశ్చిమ బెంగాల్ కోల్కతా(Kolkata)లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్కతా చేరుకుంది.